Telugu News: Bihar Election: బిహార్​లో మాదే విజయం అమిత్ షా

Read Time:  1 min
Bihar Election: బిహార్​లో మాదే విజయం అమిత్ షా
Bihar Election: బిహార్​లో మాదే విజయం అమిత్ షా
FONT SIZE
GET APP

పట్నా: బీహార్‌లో గత 20 ఏళ్లలో లేనంత భారీ మెజారిటీతో(majority) ఎన్​డీఏ ప్రభుత్వం ఏర్పడబోతుందని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా(Amit Shah) ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శరణ్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. ఎన్​డీఏకు ప్రధాని మోదీ ప్రధాన ఆకర్షణ అయినా, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోనే బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు షా వెల్లడించారు. లాలూ – రబ్రీ దేవి ‘జంగిల్​ రాజ్’ పాలనకు వ్యతిరేకంగా నితీశ్ పోరాడాడని ఆయన గుర్తు చేశారు.

Read Also: TG Crime:నలుగురు పిల్లల సాయంతో భర్తను చంపిన భార్య

Bihar Election
Bihar Election: బిహార్​లో మాదే విజయం అమిత్ షా

బీహార్ ప్రజలకు నాలుగు దీపావళి పండుగలు

ఈసారి బీహార్ ప్రజలకు నాలుగుసార్లు దీపావళి పండుగలు జరుపుకొనే అవకాశం వచ్చిందని అమిత్ షా అన్నారు. అవి:

  1. శ్రీరాముడు అయోధ్యకు తిరిగివచ్చినందుకు మొదట దీపావళి చేసుకుంటారు.
  2. ప్రభుత్వ పథకం కింద మహిళల ఖాతాల్లో రూ. 10,000 జమ చేసినప్పుడు రెండో దీపావళి.
  3. జీఎస్టీని 5 శాతానికి తగ్గించినప్పుడు మూడో దీపావళి.
  4. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు రోజు నాలుగో దీపావళిని జరుపుకొంటారు.

ఆర్టికల్ 370 రద్దుపై వ్యాఖ్యలు

జమ్ముకశ్మీర్ విషయంలో గత కాంగ్రెస్ వైఖరిని అమిత్ షా విమర్శించారు. ప్రధాని మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేసి కశ్మీర్‌ను ప్రధాన స్రవంతిలో కలిపారని ఆయన గుర్తుచేశారు. అంతకుముందు కాంగ్రెస్ పాలనలో కశ్మీర్‌లో ఉగ్రవాదులు రక్తంతో హోళీ ఆడేవారని విమర్శించారు.

బీహార్‌లో ఏ కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు?

ఎన్‌డీఏ కూటమి భారీ మెజారిటీతో గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ఎన్డీఏ కూటమి ఎవరి నాయకత్వంలో ఎన్నికల్లో పోటీ చేస్తోంది?

ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోనే ఎన్నికల్లో పోటీ చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Sushmitha

రచయిత గురించి

Sushmitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.