బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో(Bihar Election) కీలకమైన తొలి దశ పోలింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం 18 జిల్లాల పరిధిలోని 121 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ దశలో మొత్తం 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, పలువురు ప్రముఖ నేతల భవితవ్యం తేలనుంది. ముఖ్యంగా హోరాహోరీ పోరు నెలకొన్న కీలక నియోజకవర్గాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read Also: Medchal:సంగారెడ్డి జిల్లాలో ఆర్టీసీ బస్సు ప్రమాదం
ముఖ్య నేతల పోరు, నితీశ్ కేబినెట్ అగ్నిపరీక్ష
ఈ దశలో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కేబినెట్లోని 16 మంది మంత్రులు తమ స్థానాలను నిలబెట్టుకునేందుకు పోటీ పడుతున్నారు. వీరిలో 11 మంది బీజేపీ, ఐదుగురు జేడీ(యూ) మంత్రులు ఉన్నారు. ఈ ఎన్నికలు నితీశ్ ప్రభుత్వ పాలన, విశ్వసనీయతకు ఒకరకంగా అగ్నిపరీక్షగా మారాయి. మరోవైపు, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్(Tejashwi Yadav) (రాఘోపూర్), ఆయన సోదరుడు తేజ్ ప్రతాప్ యాదవ్ కూడా తమ స్థానాల్లో గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు.
ఆసక్తికర నియోజకవర్గాలు:
- తారాపూర్ (ముంగేర్): ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి పోటీ చేస్తున్నారు. ఇక్కడ చతుర్ముఖ పోరు నెలకొంది.
- మొకామా (పాట్నా రూరల్): దులార్చంద్ యాదవ్ హత్య కేసు నేపథ్యంలో ఈ స్థానం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక్కడ జేడీ(యూ) నుంచి అనంత్ సింగ్, ఆర్జేడీ నుంచి వీణా దేవి పోటీ పడుతున్నారు.
కళాకారుల హవా, కుల సమీకరణాలు
ఈ ఎన్నికల్లో కళారంగానికి చెందిన ప్రముఖులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.
- మైథిలి ఠాకూర్: ప్రముఖ జానపద గాయని మైథిలి ఠాకూర్ను బీజేపీ దర్భంగా జిల్లాలోని అలీనగర్ నుంచి బరిలోకి దించింది. ఆమెకు మిథిలాంచల్ ప్రాంతంలో ఉన్న ప్రజాదరణ కీలకం కానుంది.
- కేసరి లాల్ యాదవ్: భోజ్పురి సూపర్ స్టార్ కేసరి లాల్ యాదవ్ ఆర్జేడీ తరఫున ఛాప్రా నుంచి పోటీ చేస్తున్నారు.
- లఖిసరాయ్: ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా కాంగ్రెస్ అభ్యర్థితో తలపడుతూ వరుసగా మూడో విజయంపై కన్నేశారు. బేగుసరాయ్ వంటి స్థానాల్లో కుల సమీకరణాలు కీలకం కానున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: