Amit Shah: నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు

Read Time:  1 min
Amit Shah: నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు
FONT SIZE
GET APP

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ అందించింది. జీరో సర్వీస్ ఛార్జీలతో కేంద్రం తీసుకొచ్చిన భారత్ ట్యాక్సీ సేవలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) యాప్‌ను ప్రారంభించనున్నారు. ముందుగా ఢిల్లీ, గుజరాత్‌లో ఈ విధానం విజయవంతమైతే ముంబై, బెంగళూరు, చెన్నై, HYD వంటి నగరాలకూ విస్తరించనుంది. డ్రైవర్లే వాటాదారులు కాగా 2.5 లక్షల మంది రిజిస్టర్ చేసుకుంటారని అంచనా. ప్రైవేట్ యాప్‌లతో పోలిస్తే 20-30% తక్కువ ధరకు సేవలు అందుబాటులో ఉంటాయి.

Read Also: Hyderabad silver rate today: కుప్పకూలిన వెండి ధరలు.. లేటెస్ట్ రేట్లు ఇవే!

డ్రైవర్లకు బెనిఫిట్

ప్రైవేట్ క్యాబ్ సంస్ధలు డ్రైవర్ల నుంచి కమిషన్లు వసూలు చేస్తున్నాయి. దీంతో ఆ యాప్‌ల్లో రిజిస్ట్రర్ చేసుకుని సేవలు అందించే డ్రైవర్లను ఎక్కువ ఆదాయం లభించలేదు. అయితే భారత్ ట్యాక్సీ యాప్‌లో ఎలాంటి కమిషన్ వసూలు చేయరు. దీంతో ప్రయాణికుల నుంచి వచ్చే ఆదాయం మొత్తం డ్రైవర్‌కే వెళ్తుంది. దీని వల్ల డ్రైవర్లకు అధిక ఆదాయం లభించి వారికి బెనిఫిట్ జరగనుంది.

Bharat taxi services from today
Bharat taxi services from today

అలాగే డ్రైవర్లకు హెల్త్ ఇన్యూరెన్స్, యాక్సిడెంటల్ ఇన్యూరెన్స్, పదవీ విరమణ పొదుపులు వంటి సౌకర్యాలు కల్పించనున్నారు. అలాగే అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన డ్రైవర్లను సంత్కరించడం, వారికి ప్రోత్సహకాలు అందించడం లాంటివి చేస్తారు. ఈ సేవలు దేశవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రైవేట్ సంస్ధలతో కేంద్రం భాగస్వామ్యం కానుంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.