Bharat Taxi launch : దేశంలో క్యాబ్ బుకింగ్ రంగంలో కొత్త మార్పుకు నాంది పలుకుతూ కేంద్ర ప్రభుత్వం Bharat Taxi సేవలను ప్రారంభించింది. ఇప్పటివరకు ర్యాపిడో, ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ యాప్లే అందుబాటులో ఉండగా, సహకార రంగంలో తీసుకొచ్చిన తొలి క్యాబ్ ప్లాట్ఫామ్ ఇదే కావడం విశేషం. ఈ సేవలను కేంద్ర సహకార శాఖ మంత్రి Amit Shah గురువారం అధికారికంగా ప్రారంభించారు.
మొదట దశలో ఢిల్లీ-ఎన్సీఆర్, గుజరాత్లో ఈ సేవలు అందుబాటులోకి రానుండగా, త్వరలోనే దేశవ్యాప్తంగా విస్తరించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. ఈ యాప్ ద్వారా డ్రైవర్లకు ఎక్కువ ఆదాయం లభిస్తుందని అమిత్ షా తెలిపారు. భారత్ ట్యాక్సీ ప్రయోగాత్మకంగా ప్రారంభమైనప్పటి నుంచే ఇతర క్యాబ్ సంస్థలు తమ కమిషన్లను తగ్గించుకోవడం గమనార్హమని ఆయన చెప్పారు.
Read Also: AP: పశు ఔషధి విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలనే యోచనలో ప్రభుత్వం

దేశంలోని ఎనిమిది అగ్ర సహకార సంస్థలు కలిసి ఈ ప్లాట్ఫామ్ను తీసుకొచ్చాయి. ఈ మోడల్లో ప్రతి రూ.100 ఆదాయంలో రూ.80 నేరుగా డ్రైవర్ల ఖాతాల్లో జమ చేయగా, మిగిలిన రూ.20ను కూడా డ్రైవర్ల సంక్షేమం కోసమే వినియోగిస్తారు. సున్నా కమిషన్, సర్జ్ ఫ్రీ ధరలతో పాటు కార్లు, ఆటోలు, బైక్ల బుకింగ్ సదుపాయం ఈ యాప్లో అందుబాటులో ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: