కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, దేశవ్యాప్తంగా 10 ప్రధాన కార్మిక సంఘాలు మరియు వాటి అనుబంధ సంఘాల ఐక్యవేదిక జూలై 9న భారత్ బంద్(Bharat Bandh)కు పిలుపునిచ్చింది. కేంద్రం కార్మికుల హక్కులను లెక్కచేయకపోవడం, కార్మిక వ్యతిరేక విధానాలు అమలు చేయడంపై ఈ బంద్ చేపట్టినట్లు నేతలు తెలిపారు. గత 10 ఏళ్లుగా వార్షిక కార్మిక సమావేశాలు నిర్వహించకుండా కేంద్రం పనితీరు దుర్వినియోగమవుతోందని వారు ఆరోపిస్తున్నారు.
బ్యాంకింగ్, పోస్టల్, ఇన్సూరెన్స్ రంగాల్లో ప్రభావం
ఈ బంద్లో బ్యాంకింగ్, పోస్టల్, ఇన్సూరెన్స్ వంటి కీలక రంగాలకు చెందిన ఉద్యోగులు పాల్గొననున్నారు. దీంతో పలు సేవల్లో అంతరాయం కలగవచ్చు. ప్రజలు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ విధానాల వల్ల నిరుద్యోగిత పెరుగుతోందని, కార్మికులకు కనీస భద్రత లేకుండా పోతోందని సంఘాలు మండిపడ్డాయి.
రైతులతో కలసి విస్తృతమైన ఉద్యమం
ఈ బంద్కు రైతు సంఘాలు (Farmers’ Unions) కూడా మద్దతు తెలుపడంతో, దీని వ్యాప్తి మరింత విస్తృతమయ్యే అవకాశం ఉంది. ఆలిండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ నేతల ప్రకారం, దేశవ్యాప్తంగా సుమారు 25 కోట్ల మంది ఈ బంద్లో పాల్గొననున్నట్లు అంచనా. కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమాలు మరింత ఉధృతంగా మారతాయని హెచ్చరించారు.
Read Also : Chandrababu : రెండు రోజులపాటు ఢిల్లీలో సీఎం చంద్రబాబు పర్యటన