📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

Bhagat Singh : వీరి పేర్లు వింటేనే గుండె గర్వంతో నిండిపోతుందన్న మోదీ ,చంద్రబాబు

Author Icon By Divya Vani M
Updated: March 23, 2025 • 6:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bhagat Singh : వీరి పేర్లు వింటేనే గుండె గర్వంతో నిండిపోతుందన్న మోదీ ,చంద్రబాబు భారత స్వాతంత్ర్య సమరంలో అపురూప Chapter గా నిలిచిపోయిన భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌ల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరచిపోలేదు. వీరు స్వాతంత్ర్యం కోసం పోరాడుతూ ఉరికంబం ఎక్కిన చారిత్రక సంఘటనను గుర్తు చేసుకుంటూ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వీరికి నివాళులు అర్పించారు. 23 ఏళ్ల చిన్న వయసులోనే వీరు ప్రాణత్యాగం చేసి యువతకు చిరస్మరణీయమైన స్ఫూర్తిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఈ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, వారి బాటలో మనం నడవాలని ఆయన పిలుపునిచ్చారు.ప్రధాని నరేంద్ర మోదీ కూడా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లకు శ్రద్ధాంజలి ఘటించారు.

Bhagat Singh వీరి పేర్లు వింటేనే గుండె గర్వంతో నిండిపోతుందన్న మోదీ ,చంద్రబాబు

వీరి పేర్లు వినగానే ప్రతి భారతీయుడి గుండె గర్వంతో నిండిపోతుందని ఆయన అన్నారు.బ్రిటీష్ పాలకుల అకృత్యాలను ఎదుర్కొంటూ భరతమాత కోసం వీరు పోరాడి అమరులయ్యారని మోదీ పేర్కొన్నారు. దేశం ఈ త్యాగమూర్తులను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని ఆయన తెలిపారు.1931 మార్చి 23న బ్రిటీష్ ప్రభుత్వం భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్‌లను ఉరి తీయించింది. బ్రిటీష్ అధికారి శాండర్స్ హత్యకేసులోనూ, అసెంబ్లీలో బాంబుల ఘటనలోనూ వీరిపై కేసులు పెట్టారు. వీరి ఉరిశిక్ష భారత స్వాతంత్ర్య పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. వారి త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏడాది మార్చి 23న అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. దేశ ప్రజలు ఈ రోజు వీరిని స్మరించి, దేశభక్తిని పునరుద్ధరించుకుంటారు.

BhagatSingh IndianFreedomStruggle MartyrsDay Rajguru ShaheedDiwas Sukhdev

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.