భారత క్రికెట్లో ఒకప్పుడు దూకుడు బ్యాటింగ్తో అభిమానులను అలరించిన సురేష్ రైనా, శిఖర్ ధావన్లకు ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) భారీ షాక్ ఇచ్చింది. ఈ ఇద్దరికి చెందిన రూ. 11.14 కోట్ల విలువైన ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అటాచ్ చేసింది. బెట్టింగ్ యాప్ల (Betting App) ను ప్రచారం చేయడం వెనుక ఏదైనా ఆర్థికపరమైన కుట్ర ఉందా? అనే కోణంలో ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే సురేశ్ రైనా, శిఖర్ ధావన్ను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే.
Read Also: TATA: వరల్డ్ కప్ విజేతలకు కార్లు గిఫ్ట్ ఇవ్వనున్న టాటా
బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మాజీ క్రికెటర్లు సురేష్ రైనా, శిఖర్ ధావన్ (Suresh Raina, Shikhar Dhawan) లను ఇటీవల ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. దర్యాప్తు సమయంలో వారి వాంగ్మూలాలు నమోదు చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్లకు సంబంధించిన పలు కేసులను ఈడీ ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నది. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ చట్టవిరుద్ధం మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున మనీలాండరింగ్కు దోహదపడుతాయని కేంద్ర దర్యాప్తు సంస్థ భావిస్తున్నది.

క్రికెటర్లు ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే
ఈ (Betting App) యాప్లో లక్షలాది మంది వ్యక్తులు, పెట్టుబడిదారులను రూ.కోట్లు మోసం చేశాయని, పెద్ద మొత్తంలో పన్ను ఎగవేస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. బెట్టింగ్స్ యాప్స్కు మద్దతుగా పలువురు ప్రముఖ సినీతారలు, క్రికెటర్లు ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే.ఈ బెట్టింగ్ యాప్ కేసులో నటులు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి, నిధి అగర్వాల్, విజయ్ దేవరకొండలను కూడా తెలంగాణ పోలీసులు విచారించారు.
చట్ట విరుద్దంగా నడుస్తున్న ఈ యాప్స్ ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయల పన్నులు ఎగవేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆన్లైన్ బెట్టింగ్ను పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త బిల్లును తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే చట్ట విరుద్దమైన బెట్టింగ్ ఫ్లాట్ ఫామ్స్పై ప్రభుత్వం కొరడా ఝులిపిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: