Social media crime : బెంగళూరులో సోషల్ మీడియా పరిచయం ద్వారా స్నేహం పెంచుకుని పార్టీకి ఆహ్వానించిన యువతిపై లైంగిక దాడి జరిగిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఈ ఘటన బయటపడింది.
పోలీసుల వివరాల ప్రకారం, తమిళనాడులోని తిరుపూర్కు చెందిన 19 ఏళ్ల యువతి డిగ్రీ చదువుకోడానికి ఐదు నెలల క్రితం బెంగళూరుకు వచ్చి, ఒక ప్రైవేట్ కాలేజీలో బీఏ మొదటి సంవత్సరం చదువుతూ హాస్టల్లో నివసిస్తోంది. ఈ ఏడాది జనవరిలో ఇన్స్టాగ్రామ్ ద్వారా బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల డిక్సన్ శాండోతో ఆమెకు పరిచయం ఏర్పడి, తర్వాత స్నేహంగా మారింది.
ఫిబ్రవరి 15న పార్టీ ఉందని చెప్పి యువతిని ఆహ్వానించగా, ఆమె స్నేహితురాలితో కలిసి హాజరైంది. అక్కడ డిక్సన్ మరియు అతని స్నేహితుడు నిఖిల్ బలవంతంగా ఒక గులాబీ రంగు ట్యాబ్లెట్ తీసుకోవాలని ఒత్తిడి చేసినట్లు బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత తాను స్పృహ కోల్పోయినట్లు తెలిపింది.
Read also: Jharkhand Plane Crash: కుప్పకూలిన ఎయిర్ అంబులెన్స్
తర్వాత మెలకువ వచ్చినప్పుడు తనపై లైంగిక దాడి జరిగిందని గుర్తించిందని ఆమె తెలిపింది. విషయం బయటకు చెబితే హాని చేస్తామని బెదిరించినప్పటికీ, ధైర్యం చేసి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.
కేసులో మలుపు
ఈ ఘటనలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ఫిర్యాదు చేయడానికి ఒక రోజు ముందు నిందితులు పోలీసులను ఆశ్రయించి, ఆమె తమను బ్లాక్మెయిల్ చేస్తోందని ఆరోపించారు.
బాధితురాలు ఆలస్యంగా ఫిర్యాదు చేసిన కారణంగా, ఫిబ్రవరి 17న ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నానని, తరువాత కుటుంబ సభ్యులకు వివరించి వారి సూచన మేరకు పోలీసులను సంప్రదించినట్లు తెలిపింది.
ఈ కేసులో నిజానిజాలను వెలికితీసేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: