Bengaluru: బెంగళూరులో ఎల్పీజీ (LPG) కొరత సామాన్యుల వంటగదిపైనే కాకుండా, వారి భద్రతపై కూడా ప్రభావం చూపుతోంది. గ్యాస్ సిలిండర్ల కోసం ఏర్పడిన డిమాండ్ను ఆసరాగా చేసుకుని దొంగలు ఇళ్లలోకి చొరబడుతుండటం నగరవాసులను భయాందోళనకు గురిచేస్తోంది. సిలిండర్ల సరఫరాలో జాప్యం జరుగుతుండటంతో, నగరంలోని పలు ప్రాంతాల్లో సిలిండర్ల దొంగతనాలు పెరిగిపోయాయి. తాళం వేసి ఉన్న ఇళ్లే కాకుండా, ఆవరణలో ఉన్న సిలిండర్లను కూడా దుండగులు టార్గెట్ చేస్తున్నారు.
Read Also: Elephant Attack: ఏనుగు బీభత్సం.. వ్యక్తి మృతి!
సీసీటీవీల్లో రికార్డైన దృశ్యాలు
బెంగళూరులోని ప్రధాన నివాస ప్రాంతాల్లో కొందరు దుండగులు ద్విచక్ర వాహనాలపై వచ్చి, చాలా సునాయాసంగా గ్యాస్ సిలిండర్లను ఎత్తుకెళ్తున్న దృశ్యాలు స్థానిక సీసీటీవీ (CCTV) కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. పట్టపగలే తెగించి మరీ ఈ దొంగతనాలకు పాల్పడుతుండటం గమనార్హం.
పోలీసుల గాలింపు ముమ్మరం
బాధిత ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు. బహిరంగ ప్రదేశాల్లో లేదా ఇంటి బయట సిలిండర్లను ఉంచే వారు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నిందితుల ఫోటోలను విడుదల చేసి, వారి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :