హైదరాబాద్: దేశవ్యాప్తంగా జనాభా దామాషా ప్రకారం బిసి రిజర్వేషన్లు (BC Reservations) పెంచడంతో పాటు, కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వశాఖ ఏర్పాటు చేయాలని పలువురు అఖిలపక్ష ఎంపిలు డిమాండ్ చేశారు. ఈమేరకు బుధవారం ఢిల్లీ (Delhi)లోని ఆంధ్రప్రదేశ్ భవన్ గురజాడ కాన్ఫరెన్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు బోను దుర్గా నరేష్ యాదవ్ అధ్యక్షతన, జాతీయ బిసి సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణల ఆధ్వర్యంలో జాతీయ సెమినార్ నిర్వహించడం జరిగింది.

ఐదుగురు ఎంపీల డిమాండ్
దీనికి ఐదుగురు ఎంపీలు (Five MPs) ఆర్. కృష్ణయ్య కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, బీదమస్తాన్ రావు తెలుగుదేశం, రాజ్యసభ సభ్యులు, బిజెపిఎంపీ పాకాల సత్యనారాయణ, మాజీ ఎంపీ వి హనుమంతరావు బిపి మండల్ మనవడు సూరజ్ మండల్, విసి కరుణా నిధి తదితరులు పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ ఈసెమినార్కు దేశవ్యాప్తంగా ఉన్న 36 బీసీ సంఘాలు, 28 బిసి కుల(BC Reservations) సంఘాలు 32 ఉద్యోగ సంఘాలతోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తమిళనాడు, యూపీ ఢిల్లీ నుండి పలువురు ప్రతినిధులు హాజరైనట్లు తెలిపారు. ఈసమావేశానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఢిల్లీ ఇంచార్జ్ కర్రి వేణు మాధవ్ వ్యాఖ్యాతగా వ్యవహరించగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి నందగోపాల్, బోన్ శారద జగదీశ్వరరావు, మురళి, కృష్ణమాచారి, శ్రీనివాస్, వెంకటరమణ, రేణు, శరత్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు .
Read hindi news: hindi.vaartha.com
Read also: Vijay Devarakonda: బెట్టింగ్ యాప్స్ కేసులో హీరో విజయ్ దేవరకొండకు మరోసారి ఈడీ నోటీసులు