BC protest: దేశరాజధాని ఢిల్లీ జంతర్మంతర్ వేదికగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో బీసీ సంఘాల ధర్నా కొనసాగుతోంది. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను బీసీ సంఘాలు ధర్నాకు ఆహ్వానించాయి. ఈ నిరసనలో తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, నటుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి
ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలే తదితరులు ఈ ధర్నాకుకు హాజరై సంఘీభావం తెలిపారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును.. పార్లమెంట్లోనూ ఆమోదించి అమలు చేయాలని.. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని, 33శాతం మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్కోటా కేటాయించాలని నేతలు డిమాండ్ చేశారు.
జంతర్మంతర్ దగ్గర బీసీ ధర్నాకు పిలుపు
కాగా, తెలంగాణ బీసీ మంత్రులు, నేతలు ఢిల్లీ జంతర్మంతర్ దగ్గర బీసీ ధర్నాకు పిలుపునిచ్చారు. బీసీల రిజర్వేషన్ల పెంపు బిల్లును పార్లమెంట్ ఆమోదించాలని ఢిల్లీ గడ్డపై నినదించే లక్ష్యంగా ఈ ధర్నా కొనసాగనుంది. సీఎం రేవంత్ రె డ్డి, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ కూడా ధర్నాలో పాల్గొంటూన్నారు. ఐతే కొందరు కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ బీసీ ధర్నా విషయంలో ఏమైనా తొందరపడుతున్నామా అనే డౌట్ వ్యక్తం చేస్తున్నారట కాంగ్రెస్ నేతలు.