హైదరాబాద్ : ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో నిందితులకు ఆశ్రయం ఇచ్చిన హరియాణాలోని ఫరీదాబాద్ లో గల అల్ ఫలాహ్ యూనివర్శిటీ చైర్మన్ జావెద్ సిద్ధిఖీ సోదరుడు హమూద్ అహ్మద్ సిద్ధిఖీని మధ్యప్రదేశ్ పోలీసులు నకిలీ బ్యాంకుతో(Bank Scam) అమాయకులను టోకరా వేసిన కేసులో అరెస్టు చేశారు. 25 ఏళ్ల క్రితం ఈ గోల్మల్ వెలుగు చూడగా దీనిపై అప్పట్లో నమోదైన కేసులో ఇతను వాంటెడ్ నేరగాడు. ఇంతకాలం పరారీలో వున్న ఇతను ఢిల్లీ కారు బాంబు దాడి తరువాత అల్ ఫలాహ్ యూనివర్శిటీ ఛైర్మన్ జావెద్ సిద్ధిఖీని(Javed Siddiqui) పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అతగాడి సోదరుడి భాగోతం రట్టయ్యింది. దీంతో ఢిల్లీ పోలీసుల సమాచారం మేరకు మధ్యప్రదేశ్ పోలీసులు హమూద్ అహ్మద్ సిద్ధిఖీని నగరంలో అరెస్టు చేశారు.
Read Also: Karimnagar Crime: కన్నతండ్రే కాలయముడు

వివరాలలోకి వెళితే
వివరాలలోకి వెళితే మధ్యప్రదేశ్లోని మహూ ప్రాంతంలో 2000 సంవత్సరంలో హమూద్ అహ్మద్ సిద్ధిఖీ ఓ నకిలీ బ్యాంకును స్థాపించి అధిక వడ్డీ పేరుతో అమాయకుల నుంచి 50 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసి బిచాణా ఎత్తేశాడు. దీనిపై కేసు నమోదవగా హమూద్ అహ్మద్ సిద్దిఖీ కుటుంబంతో సహా పారిపోయి హైదరాబాద్ కు మొహం మార్చి వేరే పేరుతో ఇక్కడ సాధారణ వ్యక్తిగా వుంటూ షేర్ మార్కెటింగ్ చేయసాగాడు. మరోవైపు హమూద్ అహ్మద్ సిద్ధిఖీ కోసం మధ్యప్రదేశ్ పోలీసులు 25 ఏళ్లుగా గాలిస్తున్నా ఆచూకీ లభించక పోవడం తో ఈ కేసును పెండింగ్లో వుంచారు.
కాగా ఢిల్లీ పేలుడు తరువాత అల్ ఫలాహ్ యూనివర్శిటీ చైర్మన్ గా వున్న జావెద్ సిద్దిఖీ పాత్రపై ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, హరియాణా పోలీసులు విచారణ చేబట్టగా ఇతగాడి పై వున్న కేసులు ఇతని సోదరుడు హమూద్ అహ్మద్ సిద్దిఖీపై వున్న కేసుల సంగతి వెలుగు చూసింది. దీంతో హమూద్ అహ్మద్ సిద్దిఖీ గురించి ఢిల్లీ పోలీసులు మధ్యప్రదేశ్ పోలీసులకు సమాచారం అందించగా వారు వెంటనే విమానంలో హైదరాబాద్ కు వచ్చి ఇతన్ని అరెస్టు చేసి తమ వెంట తీసుకుపోయారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: