ఇటీవల బంగ్లాదేశ్ (Bangladesh) మాజీ ప్రధాని షేక్ హసీనాకు ట్రిబ్యూనల్ కోర్టు ఉరిశిక్ష విధించిన నేపథ్యంలో ఆదేశంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఆమెను తమకు అప్పగించాలనే ఆ దేశ తాత్కాలిక ప్రధాని యూనస్ భారత్ కు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అయితే భారతదేశం ఒకవేళ తన తల్లిని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అప్పగిస్తే ఆమెను బతకనివ్వరని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) కుమారుడు సాజీబ్ వాజెద్ జోయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తల్లిని బంగ్లాదేశ్ కు అప్పగిస్తే అక్కడి మిలిటెంట్లు ఆమెను హతమారుస్తారని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం భారత్ లో ఆశ్రయం పొందుతున్న తన తల్లికి భద్రత కల్పించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞలు తెలిపారు. సరిహద్దుల్లో ఉగ్రవాదం పెరిగిపోతోందని, ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆయన భారత్ ను హెచ్చరించారు.
Read also : Sabarimala: పోటెత్తిన అయ్యప్ప భక్తులు..అవస్థలు పడ్తున్న వైనం
అపహాస్యం చేస్తోన్న న్యాయవ్యవస్థ: సాజీబ్
ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాజీబ్ మాట్లాడుతూ.. తన తల్లిని అప్పగించాలన్న బంగ్లాదేశ్ ప్రభుత్వ అభ్యర్థనను తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం బంగ్లా ప్రభుత్వం న్యాయప్రక్రియను అపహాస్యం చేస్తోందని ఆరోపించారు. తన తల్లిపై తప్పుడు కేసులు బనాయించారని, 17మంది న్యాయమూర్తులను తొలగించి, పార్లమెంట్ ఆమోదం లేకుండానే చట్టాలను సవరించి విచారణ జరుపుతున్నారని విమర్శించారు. కనీసం డిఫెన్స్ లాయర్లను కూడా కోర్టులోకి అనుమతించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
భారత్ మా అమ్మ ప్రాణాలను కాపాడింది అని, ఆమె బంగ్లాదేశ్ లోనే ఉండిఉంటే మిలిటెంట్లు చంపేసేవారని సాజీబ్ అన్నారు. యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, హసీనా హయాంలో అరెస్టయిన వేలాదిమంది ఉగ్రవాదులను విడుదల చేసిందని ఆరోపించారు. ప్రస్తుతం లష్కరే తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలు బంగ్లాదేశ్ లో స్వేచ్ఛగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపారు. బంగ్లా ఉగ్రవాదంపై భారత ప్రధాని మోదీ కూడా చొరవ ఆందోశనతో ఉన్నారని తాను భావిస్తున్నట్లు చెప్పారు. అంతేకాక తన తల్లిని అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం చేసిన అభ్యర్థనను భారత్ తిరసస్కరిస్తుందన్న నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read also :