📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Bangalore: బెంగళూరులో గ్యాస్ దొరక్క హోటళ్లు బంద్..తిండి కోసం విలవిలలాడుతున్నజనం

Author Icon By Vanipushpa
Updated: March 10, 2026 • 11:48 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలకు రెక్కలు వచ్చాయి. దీంతో గ్యాస్ ధరలు అమాంతం పెరిగాయి.తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరు(Bangalore)లో హోటళ్లు, రెస్టారెంట్ల కార్యకలాపాలు మార్చి 10 నుండి తీవ్ర అంతరాయాలను ఎదుర్కొనే అవకాశం ఉందని బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ సోమవారం ప్రకటించింది. వాణిజ్య LPG గ్యాస్ సిలిండర్ల సరఫరా అకస్మాత్తుగా పూర్తిగా నిలిచిపోవడంతో నగరంలోని ఆహార వ్యాపార రంగం సంక్షోభంలో పడింది. నగరవ్యాప్తంగా వేలాది హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లు ఈ గ్యాస్ సరఫరాపైనే ఆధారపడటంతో వంట కార్యకలాపాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. అసోసియేషన్ ప్రకారం.. పశ్చిమాసియాలో కొనసాగుతున్న సంఘర్షణలు, పెరుగుతున్న ఇంధన ఖర్చులు, సరఫరా గొలుసులో ఏర్పడిన అంతరాయాల కారణంగా ఈ సంక్షోభం ఏర్పడింది. నగరంలోని 3 వేల కంటే ఎక్కువ హోటళ్లు మరియు రెస్టారెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సంస్థ.. పరిస్థితి త్వరగా పరిష్కారం కాకపోతే అనేక వంటశాలలు మూతపడే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Read Also: Trump: త్వరలోనే యుద్ధం ముగింపు..చమురు ధరల్లో భారీ మార్పు!

Bangalore: Hotels in Bangalore closed due to lack of gas.. People are struggling for food.

అకస్మాత్తుగా సరఫరాను నిలిపివేయడం హోటల్ రంగానికి పెద్ద దెబ్బ

మేము సేవలను నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిందని అసోసియేషన్ ప్రకటించింది. హోటళ్లు మూసివేయబడితే నగరంలోని సాధారణ ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు, వైద్య రంగానికి చెందిన నిపుణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని వారు పేర్కొన్నారు. ఎందుకంటే ఈ వర్గాల చాలామంది రోజువారీ ఆహారం కోసం రెస్టారెంట్లు, టిఫిన్ సెంటర్లపై ఆధారపడుతున్నారు. పరిశ్రమ ప్రతినిధులు చమురు మార్కెటింగ్ కంపెనీలపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో కనీసం 70 రోజుల పాటు గ్యాస్ సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని హామీ ఇచ్చినప్పటికీ, ఇప్పుడు అకస్మాత్తుగా సరఫరాను నిలిపివేయడం హోటల్ రంగానికి పెద్ద దెబ్బగా మారిందని అసోసియేషన్ తెలిపింది. ఈ సమస్యను పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకోవాలని వారు కోరుతున్నారు. బెంగళూరు హోటల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు పిసి రావు మీడియాతో మాట్లాడుతూ.. హోటల్ యజమానులు సేవలను నిలిపివేయాలనే ఉద్దేశం లేదని, కానీ ఇంధనం లేకపోవడంతో ఇది అనివార్యమైందని తెలిపారు. మంగళవారం నుంచి హోటళ్లలో గ్యాస్ అందుబాటులో ఉండదు. అందువల్ల ఆహారం, ఇతర రిఫ్రెష్‌మెంట్‌లను కూడా అందించలేమని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రులు, స్థానిక పార్లమెంటు సభ్యులకు ఇప్పటికే లేఖలు పంపామని, సమస్యను త్వరగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశామని ఆయన పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Bangalore gas shortage commercial gas cylinder shortage food crisis Bangalore hotels closed in Bengaluru Karnataka News LPG supply crisis Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.