హైదరాబాద్ : పాలనలో పారదర్శకత, జవాబుదారీతనంపై సమచార హక్కు చట్టం(ఆర్టీఐ) కీలకంగా మారిందని తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఛైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి(Balakishta Reddy) అన్నారు. సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిం చడంలో భాగంగా ఈ నెల 5 నుంచి 12 వరకు ఆర్టీఐ వీక్-2025ను నిర్వహించనున్నట్టు తెలిపారు. అందులో భాగంగా మంగళవారం ఆయన యూని వర్సిటీ విసిలు, రిజిస్ట్రార్లతో వీడియో కాన్ఫరెన్స్ ను నిర్వహించారు.
Read also: Railway sports:ఆల్ ఇండియా రైల్వే కబడ్డీ ఛాంపియన్ షిప్ పోటీలు ప్రారంభం

ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ ఛైర్మన్-1 ప్రొఫెసర్ ఇటిక్యాల పురుషోత్తం, కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాల కిష్టారెడ్డి(Balakishta Reddy) మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం, 2005 ప్రజా స్వామ్య పరంపర, పారదర్శకత, జవాబు దారీతనం కోసం కీలకమైన చట్టమని తెలిపారు. భారతదేశంలో ఆర్టీఐ చట్ట చరిత్ర, రాజ్యాంగ పరిరక్షణలు ప్రధానమైన సుప్రీంకోర్టు తీర్పులను వివరించారు. ఆరిటిఐచట్టం అంతర్జాతీయ మానవహక్కుల ప్రమాణాలను భారత రాజ్యాంగ హామీలతోకలిపి పనిచేస్తుందన్నారు.
ఆర్టిఐ చట్టంలోని సెక్షన్4 (పబ్లిక్ అథారిటీల బాధ్య తలు), సెక్షన్ 8(మినహాయింపులు) పై విశేషంగా దృష్టిపెట్టారు. ఏ సమాచారం వెల్లడించవచ్చునో, ఏదికాదు అనే దిశానిర్దేశాలను విసి, రిజిస్ట్రార్లకు వివరించారు. విశ్వవిద్యాలయాలకు ఆర్టిఐ క్వెరీస్ నిర్వహణ కోసం సాధారణ బుక్లెట్, హ్యాండ్ బుక్ తయారీలో భాగస్వామ్యం చేయాలని కోరారు. కార్యక్రమం ముగింపులో ఉన్నత విద్యా మండలి కార్యదర్శి ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్, పాల్గొన్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. అన్ని విశ్వవిద్యాల యాలు ఆర్టీఐ వారం (5 నుంచి 12 అక్టోబర్) అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ఫోటోలు, నివేదికలను ఈనెల 15 నాటికి తెలం గాణ ఇన్ఫర్మేషన్ కమిషన్, తెలంగాణ ఉన్నత విద్యా మండలికి సమర్పించాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: