Assembly Election 2026: భారతదేశంలోని ఐదు కీలక రాష్ట్రాల్లో ఎన్నికల నగారా మోగనుంది. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు, కేరళ రాష్ట్రాలతో పాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం (ECI) నేడు విడుదల చేసే అవకాశం ఉంది. ఈ ఎన్నికల షెడ్యూల్ను వీలైనంత తక్కువ దశల్లో పూర్తి చేయాలని కమిషన్ యోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
Read Also:Rice Export Crisis: తెలంగాణలో ధాన్యం ధరల పతనం
సాయంత్రం 4 గంటలకు నోటిఫికేషన్
తాజా సమాచారం ప్రకారం, ఆదివారం సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి ఎన్నికల తేదీలను ప్రకటించనుంది. ఈ ప్రకటన వెలువడిన వెంటనే, ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో తక్షణమే ‘ఎన్నికల ప్రవర్తనా నియమావళి’ (Model Code of Conduct) అమల్లోకి వస్తుంది. దీనివల్ల ప్రభుత్వాలు కొత్త పథకాలను ప్రకటించడం లేదా ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకోవడంపై ఆంక్షలు విధించబడతాయి.
ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపిక మరియు మేనిఫెస్టోల తయారీలో నిమగ్నమయ్యాయి. భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతో ప్రచారం ఇప్పటికే హోరెత్తుతోంది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతున్న ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అందరి కళ్లు నేడు వెలువడనున్న షెడ్యూల్పైనే ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: