అధిక శబ్దాలకు పూర్తిగా దూరంగా ఉంటూ, పక్షుల(Assam) కోసం ప్రశాంతతను కాపాడుకుంటున్న అరుదైన గ్రామమే అసోంలోని మోరిగావ్ జిల్లాలో(Morigaon district) ఉన్న జుర్గావ్. ఈ గ్రామం నిశ్శబ్దానికి, పర్యావరణ ప్రేమకు చిరునామాగా నిలుస్తోంది. ఇక్కడ నివసించే తివా తెగకు చెందిన 121 కుటుంబాలు పక్షుల పట్ల అపారమైన ప్రేమను చూపిస్తారు. అందుకే ఆ గ్రామంలో టపాసులు పేల్చడం, డీజేలు లేదా పెద్ద శబ్దాలు వచ్చే బ్యాండ్లను ఉపయోగించడం వంటివి పూర్తిగా నిషేధించారు. వాహనదారులు కూడా అత్యవసరం అయితే తప్ప హారన్లు మోగించరు. పక్షులు ఇబ్బంది పడతాయనే ఉద్దేశంతోనే గ్రామస్థులు ఈ నియమాలను తూ.చ. తప్పకుండా పాటిస్తున్నారు.
Read also: పాలకుల నిర్వాకంతో వెక్కిరిస్తున్న ధరలు

నిశ్శబ్ద నియమాలు: వెదురును కూడా కోయరు
జుర్గావ్(Assam) చుట్టూ పచ్చని వెదురు తోటలు విస్తరించి ఉన్నాయి. అనేక చిత్తడి నేలలు, నీటి వనరులు ఉండటంతో ఈ గ్రామం స్థానిక, వలస పక్షులకు సురక్షితమైన ఆవాసంగా మారింది. పొడవైన వెదురుపై పక్షులు గూళ్లు కట్టుకుంటాయని, వాటికి ఆశ్రయం కల్పించేందుకు గ్రామస్థులు వెదురును విచక్షణారహితంగా కోసి విక్రయించడానికి నిరాకరిస్తారు. అవసరానికి మించి వెదురును కత్తిరించకుండా జాగ్రత్త పడతారు. వేటగాళ్లు లేదా నేర స్వభావం కలిగిన వ్యక్తులు ఎవరూ గ్రామంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటారు.
జుర్గావ్ వాసి హర్షవర్ బోర్డోలోయ్ మాట్లాడుతూ, తరతరాలుగా మైనాలు, పిచ్చుకలు, వాటర్ హెన్లు వంటి పక్షులు సంతానోత్పత్తి కోసం మార్చి-ఏప్రిల్ నెలల్లో ఇక్కడికి వస్తాయని తెలిపారు. “మేము మా కుటుంబాలతో జీవిస్తున్నట్లే, పక్షులు కూడా తమ పిల్లలను పెంచడానికి వస్తాయి. వాటికి హాని కలిగించడం తప్పు” అని అన్నారు. తమ గ్రామంలోని చిన్నారులు సైతం పక్షుల పట్ల ప్రేమతో ఉంటారని, వాటి సంరక్షణ కోసం పాటుపడతారని మరొక గ్రామస్థుడు తెలిపారు. పర్యావరణంపై ఉన్న అపారమైన ప్రేమ, నిశ్శబ్ద నియమాలను పాటిస్తూ ఈ గ్రామ ప్రజలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: