Assam Elections: అస్సాంలో బీజేపీ తొలి జాబితా విడుదల

Read Time:  1 min
Assam Elections: అస్సాంలో బీజేపీ తొలి జాబితా విడుదల
FONT SIZE
GET APP

Assam Elections: అస్సాం అసెంబ్లీ ఎన్నికల పోరులో భారతీయ జనతా పార్టీ (BJP) దూకుడు పెంచింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసిన వెంటనే, పార్టీ తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి తొలి జాబితాను ప్రకటించింది. మొత్తం 126 స్థానాలకు గాను 88 మంది అభ్యర్థులతో కూడిన లిస్ట్‌ను అధిష్టానం విడుదల చేసింది.

Read also: WhatsApp AI feature: వాట్సాప్ లో మరింత సులభంగా AI ఎంపిక

Assam Elections: BJP releases first list in Assam
Assam Elections: BJP releases first list in Assam

జాలుక్‌బారీ నుంచే సీఎం హిమంత పోటీ

అస్సాం రాజకీయాల్లో అత్యంత కీలక నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తన పాత నియోజకవర్గమైన జాలుక్‌బారీ నుంచే మరోసారి బరిలోకి దిగుతున్నారు. అభివృద్ధి మంత్రంతో అస్సాంలో మళ్ళీ పాగా వేయాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది.

వలస నేతలకు పెద్దపీట

ఇటీవల ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నేతలకు ఈ జాబితాలో ప్రాధాన్యత లభించింది.

  • కాంగ్రెస్‌ను వీడి కమలం గూటికి చేరిన భూపేన్‌ కుమార్‌ బోరా బిహ్‌పురా నుంచి పోటీ చేయనున్నారు.
  • మరో కీలక నేత ప్రద్యుత్‌ బోర్డోలోయ్‌ దిస్పూర్‌ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు.

ఎన్నికల షెడ్యూల్ మరియు ఫలితాలు

అస్సాంలోని మొత్తం 126 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 9న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఓట్ల లెక్కింపు పూర్తి చేసి మే 4న ఫలితాలను వెల్లడించనున్నారు. దీంతో అస్సాంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Tejaswini Y

రచయిత గురించి

Tejaswini Y

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.