Assam elections 2026 : త్వరలో జరగనున్న అసోం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల జాబితాలను వరుసగా విడుదల చేస్తోంది. ఇప్పటికే మొదటి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్ తాజాగా 23 మందితో కూడిన రెండో జాబితాను విడుదల చేసింది. దీంతో ఇప్పటివరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 65కి చేరింది.
ఈ రెండో జాబితాను ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ విడుదల చేశారు. గతంలో ప్రకటించిన మొదటి జాబితాలో 42 మంది అభ్యర్థుల పేర్లు ఉన్నాయి.
రెండో జాబితాలో పార్టీ సీనియర్లు, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇచ్చారు. వీరిలో మాజీ ఎంపీ అబ్దుల్ ఖాలీక్కు కొత్తగా ఏర్పడిన మండియా నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చారు.
అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాజెద్ అలీ చౌదరి (బిర్సింగ్ జరువా), అబుల్ కలాం రషీద్ ఆలం (గోల్పారా ఈస్ట్), రకీబుద్దీన్ అహ్మద్ (చమారియా)లకు మరోసారి అవకాశం కల్పించారు.
ఇవారితో పాటు బిపుల్ గోగోయ్ (టింగ్ఖోంగ్), శంతను బోరా (న్యూ గువహటి), నూరుల్ ఇస్లాం (సృజన్గ్రామ్) వంటి నేతలకు కూడా ఈ జాబితాలో చోటు కల్పించారు.
అసోం అసెంబ్లీలో మొత్తం 126 స్థానాలు ఉన్నాయి. ప్రస్తుతం అక్కడ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారంలో ఉంది. ఈసారి కూడా ఎన్డీఏ కూటమి మరియు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమి మధ్య తీవ్ర పోటీ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Read Also: Siddipet Retired Employees Protest: సిద్దిపేటలో రిటైర్డ్ ఉద్యోగుల గర్జన..మద్దతు తెలిపిన హరీష్ రావు.
మొదటి జాబితాలో అసోం కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గోగోయ్ (జోర్హాట్), ప్రతిపక్ష నాయకుడు దేబబ్రత సైకియా (నజీరా) వంటి ప్రముఖ నేతల పేర్లను పార్టీ ప్రకటించింది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తన మిత్రపక్షాలకు కూడా 15 స్థానాలను కేటాయించింది. వీటిలో సీపీఐ(ఎం), అసోం జాతీయ పరిషత్ (AJP) వంటి పార్టీలు పోటీ చేసే అవకాశం ఉంది.
రాయ్జోర్ దళ్ పార్టీతో సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతో ఆ పార్టీ కూటమి నుంచి విడిపోయి స్వతంత్రంగా పోటీ చేయాలని నిర్ణయించింది.
గతంలో అసోంలో వరుస విజయాలతో అధికారంలో ఉన్న కాంగ్రెస్ 2016 నుంచి అధికారానికి దూరంగా ఉంది. ఈసారి ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ తీవ్రంగా ప్రయత్నిస్తోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: