📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

ఆప్ వెనుకంజ!

Author Icon By Anusha
Updated: February 8, 2025 • 11:13 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) వెనుకబడింది. పార్టీ నేషనల్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో పాటు కీలక నేతలంతా వెనుకంజలో ఉన్నారు. న్యూఢిల్లీ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేసిన కేజ్రీవాల్ ఈసారి తడబడుతున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి పర్వేశ్ వర్మ లీడ్ లో కొనసాగుతున్నారు. కల్కాజీ నియోజకవర్గం బరిలో నిలిచిన ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కీలక నేత ఆతిశీ మార్లేనా కూడా వెనుకంజలోనే ఉన్నారు. జంగ్ పుర నుంచి పోటీ చేసిన మాజీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా కూడా వెనుకంజలోనే ఉన్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి తర్వీందర్ సింగ్ లీడ్ లో కొనసాగుతున్నారు.

షాకూర్ బస్తీ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గ్రేటర్ కైలాష్ లో ఆప్ అభ్యర్థి సౌరబ్ భరద్వాజ్ 500 ఓట్ల స్వల్ప ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ ఫలితాల్లో బీజేపీ దూసుకుపోతోంది. మ్యాజిక్ ఫిగర్ 36 స్థానాలకు పైనే బీజేపీ అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. ప్రస్తుతం 50 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు లీడ్ లో ఉండగా.. ఆప్ అభ్యర్థులు 19 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నారు. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోతోంది. ఇప్పటి వరకు వెనుకంజలో ఉన్న ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఇప్పుడు కాస్త ముందుకొచ్చారు. న్యూఢిల్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ ముందంజలో ఉండగా.. బీజేపీ అభ్యర్థి పర్వేష్ వర్మ వెనుకంజలో ఉన్నారు.

Arvind Kejriwal Breaking News in Telugu Delhi Elections Google news Google News in Telugu Latest News in Telugu Paper Telugu News Telugu News Telugu News online Telugu News Paper Telugu News Today Today news

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.