ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మరో ప్రత్యేక పుణ్యక్షేత్ర యాత్రా ప్యాకేజీని ప్రకటించింది. దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాలను కలుపుతూ “దివ్య దక్షిణ జ్యోతిర్లింగ టూర్ ప్యాకేజీ”(Arunachalam Tour) అందుబాటులోకి వచ్చింది. తమిళనాడు, కేరళలోని అరుణాచలం, రామేశ్వరం, కన్యాకుమారి వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను ఈ యాత్ర కవర్ చేస్తుంది.
Read Also: IndiGo Flights: ఇండిగో 138 గమ్యస్థానాలకు సేవలు ప్రారంభం
ఈ టూర్ భారత్ గౌరవ్ ఎక్స్ప్రెస్ ద్వారా నిర్వహించబడుతుంది. మొత్తం 7 రాత్రులు / 8 రోజులు సాగే ఈ యాత్ర 2026 ఫిబ్రవరి 21న సికింద్రాబాద్(Arunachalam Tour) నుంచి ప్రారంభమవుతుంది. రైలులో మొత్తం 705 సీట్లు అందుబాటులో ఉన్నాయి — స్లీపర్ 237, 3AC 416, 2AC 52. రైలు సికింద్రాబాద్ నుంచి ప్రారంభమై జనగామ, ఖాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులు వీటిలో ఏ స్టేషన్ నుంచైనా ఎక్కవచ్చు లేదా దిగవచ్చు.
యాత్ర క్రమం
- తిరువణ్ణామలై – అరుణాచలేశ్వర దర్శనం
- రామేశ్వరం – రామనాథస్వామి ఆలయం, ప్రత్యేక పూజలు
- మధురై – మీనాక్షి అమ్మవారి దర్శనం
- కన్యాకుమారి – రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ ఆలయం
- తిరువనంతపురం – అనంత పద్మనాభస్వామి దర్శనం
- ట్రిచీ – రాంగనాథస్వామి దర్శనం
- తంజావూరు – బృహదీశ్వరాలయం దర్శనం
ఈ కార్యక్రమాల అనంతరం రైలు తిరిగి సికింద్రాబాద్కు చేరుకుంటుంది.
యాత్ర ఛార్జీలు
ఎకానమీ (స్లీపర్ క్లాస్)
- పెద్దలు: ₹14,700
- పిల్లలు (5–11 ఏళ్లు): ₹13,800
స్టాండర్డ్ (3AC)
- పెద్దలు: ₹22,300
- పిల్లలు: ₹21,200
కంఫర్ట్ (2AC)
- పెద్దలు: ₹28,700
- పిల్లలు: ₹27,400
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: