నవంబర్ వచ్చిందంటే చాలు ఢిల్లీ వాసులకు దడే. రాజధాని ప్రాంతంలో ఏటా అక్టోబర్ చివరి నుంచే వాయు కాలుష్యం గరిష్ఠ స్థాయికి చేరుతుంటుంది. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా రైతులు పంటల వ్యర్థాలు తగలబెట్టడానికి తోడు, చలికాలం కావడంతో దట్టమైన పొగ మంచు కారణంగా ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణిస్తుంది. ఈసారి కూడా దీపావళికి ముందే వాయు కాలుష్యం ప్రమాదకరస్థాయికి చేరింది. దీంతో ఢిల్లీలోని బీజేపీ ప్రభుత్వం కాలుష్యం కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే నగరంలో కృత్రిమ వర్షం (Artificial Rain) కురిపించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తైనట్లు సీఎం రేఖాగుప్తా నిన్న ప్రకటించారు. వాతావరణం అనుకూలిస్తే ఈనెల 29న ఢిల్లీలో క్లౌడ్ సీడింగ్ కు అవకాశముందని తెలిపారు. బురారి ప్రాంతంలో ప్రయోగాత్మకంగా నిర్వహించిన పరీక్ష సక్సెస్ అయినట్లు చెప్పారు. ఇది వాయు కాలుష్యంపై పోరులో శాస్త్రీయ పద్ధతిగా నిలుస్తుందన్నారు. ఈ కృత్రిమ వర్షం (Artificial Rain) వాతావరణాన్ని సమతుల్యం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Read Also : http://Kurnool Tragedy: ట్రావెల్స్ బస్సులో మంటలు.. పదుల సంఖ్యలో ప్రయాణికులు మృతి?
కృత్రిమ వర్షాన్ని క్లౌడ్ సీడింగ్ అని కూడా అంటారు. ఈ విధానంతో వెదర్లో మార్పును తీసుకువస్తారు. గాలిలో నీటి బిందువులు ఏర్పడేలా ఈ ప్రక్రియను కొనసాగిస్తారు. సిల్వర్ ఐయోడైడ్, పొటాషియం ఐయోడైడ్ లాంటి పదార్ధాలను గాలిలోకి వదులుతారు. దీని కోసం విమానాన్ని కానీ హెలికాప్టర్ను కానీ వాడే అవకాశం ఉంటుంది. అయితే ఈ ప్రక్రియ సక్సెస్ కావాలంటే, ఆ పరీక్ష సమయంలో వాతావరణంలో తేమ చాలా అవసరం అవుతుంది. గాలి కూడా అనుకూలంగా ఉంటేనే ఈ ప్రయోగం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కృత్రిమ వర్షం వల్ల గాలిలో ఉన్న దుమ్ము, ధూళి సెటిల్ అవుతుంది. నీటితో ఆ డస్ట్ కొట్టుకుపోయి.. పర్యావరణం క్లీన్ అవుతుంది.
కృత్రిమ వర్షం అంటే ఏమిటి?
కృత్రిమ వర్షం, లేదా క్లౌడ్ సీడింగ్ అని కూడా పిలుస్తారు, దీనిని వాతావరణ మార్పు సాంకేతికత అంటారు. ఇది “కృత్రిమ వర్షం” లేదా మంచును ఉత్పత్తి చేసే మేఘాల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వాతావరణాన్ని కృత్రిమంగా మారుస్తుంది, ఇది ఒక నిర్దిష్ట ప్రాంతం యొక్క అవపాత అవసరాలను తీర్చడంలో సహాయపడుతుంది.
ఢిల్లీలో కృత్రిమ వర్షం ఎందుకు పడుతోంది?
ఢిల్లీ చాలా కాలంగా వాయు కాలుష్యంతో సతమతమవుతోంది, మరియు అధికారులు దానిని తగ్గించడానికి ఒక సంభావ్య మార్గంగా క్లౌడ్ సీడింగ్ – వాతావరణ మార్పు సాంకేతికత – పరిగణించారు. మే నెలలో, ఢిల్లీ క్యాబినెట్ ఐఐటీ కాన్పూర్తో కలిసి కృత్రిమ వర్షాన్ని కురిపించే ఈ చారిత్రాత్మక చొరవను ఆమోదించింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also :