అమెరికాకు చెందిన ప్రముఖ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ మోర్గాన్ స్టాన్లీ తాజా నివేదిక ప్రకారం, భారతదేశంలోని టెలికాం కంపెనీలు త్వరలోనే మొబైల్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను గణనీయంగా పెంచే అవకాశం ఉంది. ఈ పెంపు 16 నుంచి 20 శాతం వరకు ఉండవచ్చని ఆ నివేదిక స్పష్టం చేసింది. దీంతో కోట్లాది మొబైల్ వినియోగదారులపై ప్రత్యక్ష ప్రభావం పడనుందని విశ్లేషకులు చెబుతున్నారు.2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో, అంటే 2026 ఏప్రిల్-మే నెలల్లో ఈ ధరల పెంపు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇది గత ఎనిమిదేళ్లలో నాలుగోసారి ధరల పెంపు కానుంది.
Read Also: Trains: రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: