📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest News: Recharge: రీఛార్జ్‌ రేట్లు మళ్లీ పెరగనున్నాయా?  

Author Icon By Aanusha
Updated: November 7, 2025 • 6:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సంవత్సరం చివరి నెలల్లో లేదా కొత్త సంవత్సరం ప్రారంభంలో మొబైల్‌ యూజర్ల జేబులు మళ్లీ ఖాళీ అవబోతున్నాయి. రీఛార్జ్‌ (Recharge) ప్లాన్ల ధరలు మరోసారి పెరిగే అవకాశం ఉందని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. టెలికాం రంగంలో ఉన్న మూడు ప్రముఖ కంపెనీలు — రిలయన్స్‌ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel), వొడాఫోన్‌ ఐడియా (Vi) — టారిఫ్‌లను పెంచే ఆలోచనలో ఉన్నాయని సమాచారం.

Read Also: Paytm: పేటీఎం నుంచి ట్రావెల్ బుకింగ్ యాప్

టారిఫ్ దాదాపు 10 శాతం పెరగవచ్చు.దీనిపై అధికారిక ప్రకటన చేయనప్పటికీ రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఇప్పటికే వారి అనేక రీఛార్జ్ (Recharge) ప్లాన్‌లలో మార్పులు చేశాయి. కొన్ని ప్లాన్‌ల ధర పెంచబడింది. కొన్ని ప్లాన్‌ల చెల్లుబాటు కాలం తగ్గించారు. ఉదాహరణకు.. జియో 1GB రోజువారీ బేస్ ప్లాన్ ధర గతంలో రూ.249గా ఉండేది.

 Recharge

ఖర్చును సుంకాల పెంపునకు కారణం

ఇప్పుడు దానిని రోజుకు 1.5GBకి మార్చి రూ.299 ఛార్జ్‌ చేస్తున్నారు. ఎయిర్‌టెల్ బేస్ ప్లాన్ కూడా అదే విధంగా మారింది.5G నెట్‌వర్క్ నిర్మాణం, నిర్వహణ ఖర్చును సుంకాల పెంపునకు కారణంగా టెలికాం కంపెనీలు పేర్కొన్నట్లు తెలిసింది. ఫైబర్ విస్తరణ, స్పెక్ట్రం కోసం కూడా ఖర్చులు ఉన్నాయి. అందుకే సుంకం పెరిగే అవకాశం ఉంది.

ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది జూన్ మధ్య ఈ టారిఫ్ పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. జెపి మోర్గాన్ నివేదిక ప్రకారం.. జియో తన రీఛార్జ్ ప్లాన్‌ల ధరను 15 శాతం వరకు పెంచవచ్చు. ఎయిర్‌టెల్, Vi కూడా దీనిని అనుసరిస్తాయని భావిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Bharti Airtel latest news mobile recharge price hike Reliance Jio telecom tariff increase Telugu News Vodafone Idea

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.