हिन्दी | Epaper
ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Aravalli Hills: సేవ్ ఆరావళి: సుప్రీంకోర్టు తీర్పుతో చెలరేగిన వివాదం

Pooja
Aravalli Hills: సేవ్ ఆరావళి: సుప్రీంకోర్టు తీర్పుతో చెలరేగిన వివాదం

దేశవ్యాప్తంగా ‘సేవ్ ఆరావళి’(Aravalli Hills) అనే నినాదాలతో ప్రజలు రోడ్లెక్కడానికి కారణం నవంబర్‌ 20న సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పే. ఆరావళి పర్వత శ్రేణికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను సుప్రీంకోర్టు స్వీకరించి ఆమోదం తెలపడంతో ఈ అంశం వివాదంగా మారింది. ఆరావళికి ఇచ్చిన కొత్త నిర్వచనమే ప్రజల్లో తీవ్ర ఆందోళనలకు దారితీసింది.

Read Also: Pension News: ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్ రద్దు వార్తలపై కేంద్రం వివరణ

Aravalli Hills
Save Aravalli: The controversy that erupted following the Supreme Court’s verdict.

ఆరావళి పర్వతాలకు కేంద్రం ఇచ్చిన కొత్త నిర్వచనం

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నిర్వచనం ప్రకారం 100 మీటర్లకు పైగా ఎత్తు ఉన్న పర్వతాలనే ఆరావళి(Aravalli Hills) పర్వతాలుగా పరిగణిస్తారు. అంతకంటే తక్కువ ఎత్తు ఉన్న వాటిని సాధారణ కొండలు, గుట్టలుగా గుర్తిస్తారు. అంతేకాదు, 500 మీటర్ల పరిధిలో కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ పర్వతాలు ఉండాల్సిందే. ఒకే పర్వతం మాత్రమే ఉండి, దాని చుట్టూ 500 మీటర్ల దూరంలో మరో పర్వతం లేకపోతే అది ఆరావళి పరిధిలోకి రాదన్నది ఈ కొత్త నిబంధన.

మైనింగ్ మాఫియా భయం ఎందుకు?

ఈ కొత్త నిర్వచనంతో చిన్న చిన్న కొండలు ఆరావళి రక్షణ నుంచి బయటపడే ప్రమాదం ఉందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. సుప్రీంకోర్టు కొత్త మైనింగ్ లీజులపై ఆంక్షలు విధిస్తున్నా, రాష్ట్రాలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని విచ్చలవిడిగా తవ్వకాలకు అనుమతులు ఇవ్వొచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది. దీంతో మైనింగ్ మాఫియా మరింత బలపడే ప్రమాదం ఉందని స్థానికులు భయపడుతున్నారు.

చిన్న కొండలు ప్రాంతీయ వాతావరణాన్ని సమతుల్యం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇవి వర్షపాతం, భూగర్భ జలాలు, ఉష్ణోగ్రత నియంత్రణలో సహకరిస్తాయి. ముఖ్యంగా ఆరావళి మరోవైపు ఉన్న థార్ ఎడారి విస్తరించకుండా అడ్డుకోవడంలో ఈ కొండల పాత్ర అమూల్యమైనది.
వీటిని ధ్వంసం చేస్తే పర్యావరణ సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గ్రామస్థుల ఉద్యమాలు, జైపూర్ ర్యాలీ

ఆరావళి పర్వతాలను కాపాడాలని కోరుతూ గ్రామస్థులు స్వయంగా కొండలెక్కి నిరసనలు చేపడుతున్నారు. ఇటీవల జైపూర్‌లో వేలాదిమంది పాల్గొన్న భారీ ర్యాలీ కూడా జరిగింది. కేంద్రం ఇచ్చిన కొత్త నిర్వచనాన్ని వెంటనే మార్చాలని, లేదంటే ఉద్యమాలు మరింత ఉధృతం చేస్తామని ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి.

ఈ విమర్శలపై కేంద్ర ప్రభుత్వం స్పందిస్తూ, ఆరావళి పర్వతాల్లో దాదాపు 90 శాతం ప్రాంతాన్ని ఎలాంటి తవ్వకాలకూ అనుమతించబోమని స్పష్టం చేసింది. పర్వత శ్రేణి సంరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటామని కూడా ప్రకటించింది.

ఆరావళి పర్వత శ్రేణి ప్రాముఖ్యత

ఢిల్లీ నుంచి హర్యానా, రాజస్థాన్‌, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ వరకు దాదాపు 650 కిలోమీటర్ల మేర ఆరావళి పర్వత శ్రేణి విస్తరించి ఉంది. ఇది ప్రపంచంలోనే అత్యంత పురాతన పర్వత శ్రేణిగా గుర్తింపు పొందింది. సుమారు 250 కోట్ల సంవత్సరాల క్రితం ఇవి ఏర్పడ్డాయని శాస్త్రీయ పరిశోధనలు చెబుతున్నాయి. ఈ పర్వతాల వల్లే ఉత్తర, మధ్య భారతంలో పర్యావరణ సమతుల్యత కొనసాగుతోంది. బనాస్‌, లూనీ, సబర్మతి వంటి నదులు ఇక్కడే జన్మించాయి. మౌంట్ అబూ వంటి ప్రసిద్ధ పర్వత ప్రాంతాలు కూడా ఆరావళిలో భాగమే.

జీవ వైవిధ్యం & ఢిల్లీకి గ్రీన్ లంగ్

ఆరావళి ప్రాంతంలో చిరుతలు, నక్కలు, ముంగీసలు, అనేక రకాల పక్షిజాతులు నివసిస్తున్నాయి. ఢిల్లీతో పాటు ఉత్తర భారతానికి ఇది ‘గ్రీన్ లంగ్’గా పనిచేస్తోంది. ప్రజలు నేడు స్వచ్ఛమైన గాలిని పీల్చగలుగుతున్నారంటే అందుకు ఆరావళి పెద్ద కారణం.

ఆరావళి కింద మార్బుల్‌, గ్రానైట్‌, జింక్‌, కాపర్‌ వంటి విలువైన ఖనిజాలు విస్తారంగా ఉన్నాయి. ఇదే మైనింగ్ మాఫియాను ఆకర్షిస్తోంది. ఈ కొత్త నిర్వచనంతో పర్వతాలు మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

అజిత్ పవార్ అంత్యక్రియల్లో చోరీ.. ఏడుగురు అరెస్ట్

అజిత్ పవార్ అంత్యక్రియల్లో రూ.30 లక్షల ఆభరణాల చోరీ

అజిత్ పవార్ అంత్యక్రియల్లో రూ.30 లక్షల ఆభరణాల చోరీ

ఐఫోన్ ఎయిర్‌పై భారీ ధర తగ్గింపు.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

ఐఫోన్ ఎయిర్‌పై భారీ ధర తగ్గింపు.. అమెజాన్‌లో బంపర్ ఆఫర్!

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

భారత్-అమెరికా ట్రేడ్ డీల్..వ్యవసాయ ఉత్పత్తులపై కేంద్రం క్లారిటీ

వందేభారత్ స్లీపర్‌‌ రైల్లో వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్

వందేభారత్ స్లీపర్‌‌ రైల్లో వెజ్ కర్రీ ప్లేస్‌లో చికెన్

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

సుంకాల తగ్గింపుతో ఈ రంగాలకు బిగ్ బూస్ట్..

మినిమం బ్యాలెన్స్ రుసుముల ద్వారా భారీ ఆదాయం

మినిమం బ్యాలెన్స్ రుసుముల ద్వారా భారీ ఆదాయం

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

దోపిడీ కేసులో కాల్పులు: ముగ్గురు భారతీయులు అరెస్టు

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

భారత్ చమురు కొనుగోళ్లను నిలిపివేస్తామని చెప్పలేదు: రష్యా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

మహాత్మాగాంధీ విగ్రహాన్ని కట్ చేసి ఎత్తుకెళ్లిన దుండగులు

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

ఈపీఎఫ్‌వో ఉద్యోగులకు కేంద్రం గుడ్ న్యూస్

📢 For Advertisement Booking: 98481 12870