📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Anurag Thakur : పాకిస్తాన్ పై బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఘాటు స్పందన

Author Icon By Divya Vani M
Updated: May 5, 2025 • 8:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి దేశాన్ని దిగ్భ్రాంతిలో ముంచింది.ఈ ఘటనతో పాటు సరిహద్దుల్లో పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు కొనసాగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.ఈ నేపథ్యంలో బీజేపీ నేత, మాజీ మంత్రి అనురాగ్ ఠాకూర్ పాకిస్తాన్‌పై మండిపడ్డారు. పాక్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.ఠాకూర్ మాట్లాడుతూ, “పాకిస్తాన్ తిరుగుదల లేకుండా అదే పంథాలో సాగితే అంతే!” అన్నారు.భారత్ తన సహనాన్ని పరీక్షిస్తే దారుణమైన పరిణామాలు ఎదురవుతాయని పేర్కొన్నారు.ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు.ప్రధానమంత్రి మోదీ ఈ విషయంలో స్పష్టంగా చెప్పారు. దేశ భద్రతపై రాజీ ఉండదని స్పష్టం చేశారు.దౌత్య, సైనిక, రాజకీయం.అన్ని రకాల చర్యలకూ సిద్ధంగా ఉన్నామని ఠాకూర్ వ్యాఖ్యానించారు.ఇదే సమయంలో హిమాచల్‌ప్రదేశ్‌లో మరో అంశం చర్చనీయాంశంగా మారింది.అక్కడ ఉన్న పాక్ పౌరులపై బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Anurag Thakur పాకిస్తాన్ పై బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్ ఘాటు స్పందన

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ బిందాల్ మాట్లాడుతూ, “17 ప్రాంతాల్లో ప్రజలు నిరసన చెప్తున్నారు,” అన్నారు. సిమ్లాలో నివసిస్తున్న పాకిస్తాన్ పౌరులను గుర్తించి పంపాలని డిమాండ్ చేశారు.పాక్ పౌరుల గుర్తింపులో కాంగ్రెస్ ప్రభుత్వాల నిస్సహకార్యతను బిందాల్ ఎత్తిచూపారు. “పాకిస్తాన్ పౌరులు దేశంలో ఉండటం ఆమోదయోగ్యం కాదు,” అన్నారు. కేంద్ర ఆదేశాల ప్రకారం వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు.పహల్గామ్ దాడి తర్వాత కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. భారతదేశంలో ఉన్న పాక్ పౌరులు తమ దేశానికి వెళ్లాలని సూచించింది.దీంతో గత ఆరు రోజుల్లో 786 మంది పాక్ పౌరులు అటారీ-వాఘా సరిహద్దు గుండా వెళ్లిపోయారు. వారిలో 55 మంది పాక్ దౌత్యవేత్తల కుటుంబాలు ఉన్నాయి. అలాగే, 8 మంది భారతీయులు కూడా ఉన్నారు.ఉగ్రవాదం, విదేశీ ముప్పులు వంటి అంశాల్లో ప్రభుత్వం సున్నితంగా వ్యవహరిస్తోంది. అయితే అవసరమైతే దూకుడుగా కూడా స్పందించేందుకు సిద్ధంగా ఉంది.పాకిస్తాన్ చర్యలు అంతటితో ఆగకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. దేశ భద్రత విషయంలో ప్రభుత్వం మినహాయింపులేమీ ఇవ్వదు.

Read Also : NIA :ఉగ్రదాడిలో ముష్తాక్ అహ్మద్ జర్గర్ పాత్రపై దర్యాప్తు

Anurag Thakur on Terrorism Attari Wagah Border News BJP Leaders on Pakistan India-Pakistan Latest Updates Telugu Narendra Modi on Pakistan Pakistan India Border Tensions

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.