పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయంగా దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్పై మళ్లీ విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ తన పక్షంలో ఉండే ఇస్లామిక్ దేశాల మద్దతు కోసం ప్రయత్నించింది. అయితే, 57 దేశాలు సభ్యులుగా ఉన్న ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (OIC) ఈసారి పాకిస్థాన్కు ఆశించిన మద్దతు ఇవ్వలేదని సమాచారం.
పూర్తి మద్దతు భారత్ కే
భారత్ అధికారికంగా OIC ను సంప్రదించిన నేపథ్యంలో, పాకిస్థాన్పై వారి వైఖరి స్పష్టమైంది. పహల్గామ్ దాడి తర్వాత జరిగిన పరిస్థితుల్లో భారత్ మద్దతుగా ఉన్నట్టు OIC లోని కొంతమంది సభ్యదేశాలు అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భారత్కి సౌదీ అరేబియా, మలేషియా వంటి దేశాల మద్దతు ఇది నిరూపిస్తుంది. గతంలో ఇస్లామిక్ దేశాలు పాకిస్థాన్ పక్షాన ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నట్టు కనిపిస్తోంది.
అన్ని కోణాల్లో పాక్ కు భారీ నష్టం
ఈ పరిణామాలు పాకిస్థాన్కు రాజకీయంగానూ, డిప్లొమాటిక్ంగానూ పెద్ద దెబ్బగా పరిగణించబడుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో ఒంటరిగా మిగిలిపోతున్న పాకిస్థాన్, భారత్కు మద్దతు పెరుగుతోందని తెలిసిన కొద్దిమంది విశ్లేషకులు చెబుతున్నారు. ఉగ్రవాదంపై గట్టి వైఖరి తీసుకుంటున్న భారత్కు ప్రపంచ దేశాలు సమర్థన తెలియజేయడం పాకిస్థాన్ ఒంటరితనాన్ని మరింత బట్టబయలు చేస్తోంది.
Read Also : Indian Pilot : మా కస్టడీలో భారత పైలట్ ఎవరూ లేరు – పాక్