📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

కేజ్రీవాల్‌కు మరో బిగ్ షాక్

Author Icon By Sudheer
Updated: February 15, 2025 • 3:57 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశ రాజధాని ఢిల్లీలో కొద్ది నెలలుగా చర్చనీయాంశంగా మారిన శీష్‌మహల్ వివాదం మరింత ముదిరింది. కేజ్రీవాల్‌ ముఖ్యమంత్రి అధికారిక నివాసాన్ని ఆధునీకరణ పేరిట భారీగా ఖర్చు చేయడం, నిబంధనలను ఉల్లంఘించడం వంటి ఆరోపణలు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వంపై రావడం రాజకీయ వివాదానికి దారితీసింది. ముఖ్యంగా, బీజేపీ నేతలు ఈ వ్యయాన్ని ప్రజా ధన దుర్వినియోగంగా పేర్కొంటూ ఆప్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.

ఈ వివాదంపై సమగ్ర విచారణకు ఆదేశాలు

కేంద్ర ప్రభుత్వం తాజాగా ఈ వివాదంపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఫిబ్రవరి 13న కేంద్ర ప్రజా పనుల విభాగం తన నివేదికను సమర్పించిన అనంతరం, నరేంద్ర మోదీ ప్రభుత్వం శీష్‌మహల్‌ పునరుద్ధరణలో నిబంధనల ఉల్లంఘనలపై ప్రత్యేక విచారణ జరిపించాలని నిర్ణయించింది. 40 వేల చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంపై భారీగా ఖర్చు పెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా మార్పులు చేయడం కీలక అంశాలుగా మారాయి.

టాయిలెట్లలో గోల్డెన్ కమోడ్‌లు

బీజేపీ నేతలు ఈ ఆధునీకరణలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్నారు. టాయిలెట్లలో గోల్డెన్ కమోడ్‌లు, స్విమ్మింగ్ పూల్, మినీ బార్‌ వంటి లగ్జరీ సదుపాయాల ఏర్పాటుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మొత్తం రూ.80 కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు చేశారనే ఆరోపణల నేపథ్యంలో విచారణకు కేంద్రం ఆదేశించడం గమనార్హం.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాభవం

ఇటీవల జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాభవం పాలైంది. మొత్తం 70 సీట్లలో బీజేపీ 48 స్థానాల్లో గెలిచి 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో తిరిగి అధికారంలోకి వచ్చింది. మరోవైపు, 12 ఏళ్ల పాటు ఢిల్లీని పాలించిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 22 స్థానాలకే పరిమితమైంది. ఆప్ కీలక నేతలు, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఇతర మంత్రులు పరాజయం పాలయ్యారు.

బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధం

ఇప్పటికే బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతోంది. ఫిబ్రవరి 19 లేదా 20న ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు సమాచారం. అయితే, కొత్త ప్రభుత్వం ఈ శీష్‌మహల్‌ భవనాన్ని అధికార నివాసంగా ఉపయోగించదని బీజేపీ స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదం ఇంకా ముదిరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Google news Kejriwal sheesh mahal

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.