Anil Ambani: అనిల్ అంబానీపై ప్రాడ్ ముద్ర వేసిన ఎస్బీఐ

Read Time:  1 min
Anil Ambani: అనిల్ అంబానీపై ప్రాడ్ ముద్ర వేసిన ఎస్బీఐ
FONT SIZE
GET APP

భారతదేశంలో ఒకప్పుడు తనదైన ముద్రవేసుకున్న పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ అనీల్ ధీరుభాయి అంబానీ గ్రూప్అ ధినేత అనిల్ అంబానీ (Anil Ambani)కి ఎస్బీఐ ఊహించని షాక్ తగిలింది. రిలయన్స్ కమ్యూనికేషన్స్, అనిల్ అంబానీని ప్రాడ్గా ఎస్జీఐ ఈనెల 13వ తేదీని గుర్తించినట్టు లోక్ సభకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి (Pankaj Chaudhary) చెప్పడం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది.


అత్యంత సంపన్నుడిగా వెలిగిన అనిల్


ఒకప్పుడు దేశంలో అత్యంత సంపన్నుడిగా ఒక వెలుగు వెలిగిన అనిల్ అంబానీ (Anil Ambani), ఆ తర్వాత అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఒకానొక సందర్భంలో తను ఆర్థికంగా దిగజారిపోయానని ఆయనే స్వయంగా చెప్పిన పరిస్థితి. తన బ్యాంక్ బ్యాలెన్స్ జీరోకి చేరుకుందని కోర్టుకు చెప్పుకున్న దుస్థితి. అయితే ఇటీవల తిరిగి ఆయన వ్యాపారాలలో చురుగ్గా పాల్గొంటున్నారు. ఇక ఈ సమయంలో తాజాగా మరోమారు ఆయనకు ఊహించని దెబ్బ తగిలింది.


అనిల్ అంబానీ, ఆర్కాం ప్రాడ్ అన్న ఎస్టీఐ


దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగసంస్థ అయిన ఎస్బిఐ నుండి అనిల్ అంబానీ, రిలయన్స్ కమ్యూనికేషన్స్ (Reliance Communications) సంస్థ కోసం రుణం తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో ఎస్బిఐ అనిల్ అంబానీకి సంబంధించిన రిలయన్స్ కమ్యూనికేషన్ సంస్థను. అనిల్ అంబానీ మోసపూరితమైనవిగా ప్రకటించింది. ఈ విషయంపైన కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సిబిఐకి ఫిర్యాదు చేయడానికి రెడీ అవుతోంది.


ఆర్బీఐ విధానాల మేరకే ఈ నిర్ణయం అంటున్న ఎస్బిఐ


ఇక ఇదే విషయాన్ని నేడు ఆర్థికశాఖ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. 2025 జూన్ 13వ తేదీన ఆర్ కాం, అనిల్ అంబానీలను ఫ్రాడ్గా ప్రకటించింది ఎస్బిఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫ్రాడ్ రిస్క్ మేనేజ్మెంట్ నిబంధనలు, అలా బ్యాంకు బోర్డు ఆమోదించిన విధానల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్బిఐ పేర్కొంది .

Read hindi news: hindi.vaartha.com

Read also: IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మరో విద్యార్థి మృతి

Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి రాజీనామాపై ప్రధాని మోదీ ట్వీట్‌

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.