📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే ఆధార్ వినియోగంలో కొత్త మార్పులు ఇస్రో ‘బాహుబలి’ విజయవంతం 22 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల LIC హౌసింగ్ ఫైనాన్స్ హోం లోన్లపై శుభవార్త ముంబై–దుబాయ్ అండర్‌వాటర్ బుల్లెట్ ట్రైన్! దేశంలోనే పొడవైన డబుల్ డెక్కర్ కారిడార్ ఐఐటీ ఢిల్లీ అద్భుత ఆవిష్కరణ.. మాజీ చీఫ్ లకు నోటీసులు

Telugu News: Amnit Kumar: ఐపీఎస్ పూరన్ కుమార్ ఆత్మహత్య కేసు..భార్య పై కేసు నమోదు

Author Icon By Sushmitha
Updated: October 16, 2025 • 2:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హర్యానా(Haryana) ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్(Pooran Kumar) ఆత్మహత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. పూరన్ కుమార్ భార్య, ఐఏఎస్ అధికారి అమ్నీత్ కుమార్ పై పోలీసులు తాజాగా ఎఫ్‌ఐఆర్(FIR) నమోదు చేశారు. పూరన్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న రెండు రోజుల తర్వాత, ఆయనపై అవినీతి ఆరోపణలు చేస్తూ రోహ్‌తక్ ఏఎస్ఐ సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.

 Read Also: Central: కరెంటు సరఫరా ప్రై’వేటు’!

ఏఎస్ఐ సందీప్ భార్య ఫిర్యాదు, ఆరోపణలు

తన భర్త మరణానికి ఐఏఎస్ అధికారి అమ్నీత్ కుమారే కారణమంటూ ఏఎస్ఐ సందీప్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. పూరన్ అవినీతిపై తన భర్త విచారణ జరుపుతున్నాడని, అందుకే ఆయనపై పూరన్, అమ్నీత్ సహా ఉన్నతాధికారులు వేధింపులకు పాల్పడ్డారని సందీప్ భార్య ఆరోపించారు. అమ్నీత్ ను అరెస్టు చేసేంత వరకు తన భర్తకు అంత్యక్రియలు జరపబోమని చెబుతూ, బంధువులతో కలిసి సందీప్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు అమ్నీత్ కుమార్ పై కేసు నమోదు చేశారు.

పూరన్ కుమార్ సూసైడ్ వివాదం

కుల వివక్షతో ఉన్నతాధికారులు తనను వేధిస్తున్నారని, తప్పుడు కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ హర్యానా జైళ్ల శాఖ ఐజీ, ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ ఇటీవల తన నివాసంలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన భార్య అమ్నీత్ కుమార్, తన భర్త మరణానికి కారణమైన హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్, రోహ్‌తక్ ఎస్పీ బిజార్నియాను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన సంచలనం కావడంతో హర్యానా ప్రభుత్వం డీజీపీని సెలవుపై పంపడంతో పాటు రోహ్‌తక్ ఎస్పీని సస్పెండ్ చేసింది.

సందీప్ కుమార్ ఆత్మహత్య లేఖ

పూరన్ కుమార్ మరణించిన రెండు రోజుల తర్వాత రోహ్‌తక్ ఏఎస్ఐ సందీప్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. పూరన్ కుమార్ అత్యంత అవినీతిపరుడని, తన అవినీతిపై విచారణ జరుగుతుండడంతో నిజాలు బయటపడతాయనే భయంతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నాడని సందీప్ కుమార్ తన సూసైడ్(Suicide) లేఖలో ఆరోపించారు. డీజీపీ శత్రుజీత్ కపూర్ నిజాయితీపరుడని, పూరన్ కుమార్ తప్పుడు ఆరోపణలు చేశాడని విమర్శించ

ఐపీఎస్ పూరన్ కుమార్ భార్యపై కేసు ఎందుకు నమోదైంది?

రోహ్‌తక్ ఏఎస్ఐ సందీప్ కుమార్ ఆత్మహత్యకు ఆమె కారణమని సందీప్ భార్య ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

ఏఎస్ఐ సందీప్ కుమార్ ప్రధానంగా ఏ ఆరోపణలు చేశారు?

ఐపీఎస్ పూరన్ కుమార్ అవినీతిపరుడని, తన అవినీతిపై విచారణ జరుగుతున్నందున భయంతో ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com/

Read Also:

Amneet Kumar Google News in Telugu Haryana police. IAS officer Latest News in Telugu police corruption Puran Kumar Suicide Rohtak SP Sandeep Kumar Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.