బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేగంగా కొనసాగుతోంది. తాజా వివరాల ప్రకారం, 174 స్థానాల్లో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. మరోవైపు, 66 స్థానాల్లో మహాఘటబంధన్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జనసురాజ్ పార్టీ ప్రభావం కనిపించలేదు.
Read Also: Jubilee Hills Results: జూబిలీ హిల్స్ లో రెండవ రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం

అమిత్ షా అంచనాలకు అనుగుణంగా ఫలితాలు
ప్రచార సమయంలో హోంమంత్రి అమిత్ షా(AmitShah) చేసిన వ్యాఖ్యలు నిజం అవుతున్నాయి. ఎన్డీఏ 160కి పైగా సీట్లు గెలుస్తుందని, రెండు-మూడొంతుల మెజారిటితో ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన ప్రకటించారు. ఉదయం ప్రారంభమైన లెక్కింపులోనే ఎన్డీఏ(National Democratic Alliance) భారీ ఆధిక్యాన్ని ప్రదర్శించడం, ఈ అంచనాలను బలపరుస్తోంది. విశ్లేషకుల ప్రకారం, ఇది అమిత్ షా(AmitShah) వ్యూహాలకు దక్కిన విజయంగా భావిస్తున్నారు.
మహాఘటబంధన్కు భారీ ఎదురుదెబ్బ
లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని మహాఘటబంధన్కు ఈ ఎన్నికలు చేదు ఫలితాలను అందిస్తున్నాయి. తేజస్వి యాదవ్ నేతృత్వంలోని ఆర్జేడీ తన స్థాయికి తగినన్ని సీట్లు సాధిస్తున్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ బలహీనత కారణంగా కూటమి మొత్తం దెబ్బతిన్నది. 2020లో 75 సీట్లు సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచిన RJD, ఈసారి ఆ స్థానం కోల్పోయే పరిస్థితి కనిపిస్తోంది.
పార్టీల వారీగా తాజా ఆధిక్యాలు
- జేడీయూ – 79
- బీజేపీ – 74
- ఏఎప్జేపీ (RV) – 17
- ఆర్జేడీ – 47
- కాంగ్రెస్ – 11
బీహార్ రాజకీయ దిశ పూర్తిగా మారుతోందని తాజా లెక్కింపు స్పష్టం చేస్తోంది
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: