తూర్పు నాగాలాండ్లో కొనసాగుతున్న సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా కీలక ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం, నాగాలాండ్ రాష్ట్ర ప్రభుత్వం, ఈస్టర్న్ నాగాలాండ్ పీపుల్స్ ఆర్గనైజేషన్ల మధ్య అమిత్ షా(AmitShah) సమక్షంలో కీలక ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా స్వయం ప్రతిపత్తితో కూడిన ఫ్రంటియర్ నాగాలాండ్ టెరిటోరియల్ అథారిటీ (FNTA)ను ఏర్పాటు చేయనున్నారు.
Read Also:Pariksha Pe Charcha: విద్యార్థులతో ముచ్చటించిన ప్రధాని మోదీ
మినీ సెక్రటేరియట్ ద్వారా ఆరు జిల్లాల అభివృద్ధి
ఈ ఒప్పందం ప్రకారం, తూర్పు నాగాలాండ్లోని(AmitShah) ఆరు జిల్లాల అభివృద్ధికి ప్రత్యేకంగా మినీ సెక్రటేరియట్ ఏర్పాటు చేయనున్నారు. పరిపాలనను ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యంగా ఉండనుంది. ఈ ఒప్పందం ద్వారా తూర్పు నాగాలాండ్లోని 8 ప్రధాన నాగా తెగల సంక్షేమానికి ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయనున్నారు. విద్య, ఆరోగ్యం, మౌలిక వసతులు, ఉపాధి వంటి రంగాల్లో సమగ్ర అభివృద్ధి సాధించేందుకు చర్యలు చేపట్టనున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: