Amit Shah : న్యూఢిల్లీ ఎన్నికల సంస్కరణలపై లోక్సభలో జరిగిన చర్చ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు బుధవారం తీవ్ర రాజకీయ దుమారం రేపాయి. కాంగ్రెస్ పార్టీపై “వోట్ల దొంగతనం” ఆరోపణలు చేస్తూ, మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీతో పాటు సోనియాగాంధీ పేరును ప్రస్తావించడంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా నిరసనకు దిగారు.
ప్రతిపక్షాలు లేవనెత్తిన “వోట్ల చోరీ” ఆరోపణలకు ప్రతిస్పందనగా అమిత్ షా, కాంగ్రెస్ పాలనలో జరిగిన మూడు దశల ఎన్నికల అక్రమాలుగా పేర్కొన్నారు. అందులో ఒకటి ఢిల్లీలో పెండింగ్లో ఉన్న కేసును ఉదహరిస్తూ, భారత పౌరసత్వం పొందకముందే సోనియాగాంధీ ఓటర్గా నమోదు అయ్యిందన్న ఆరోపణలున్నాయని అన్నారు.
Latest News: TG Drone Show:గ్లోబల్ సమ్మిట్లో చారిత్రక ఘట్టం: డ్రోన్ షోతో గిన్నిస్ రికార్డు నమోదు
“అర్హత లేకపోయినా ఓటర్గా నమోదు కావడం వోట్ల దోపిడీకి నిదర్శనం. కొంతకాలం క్రితం ఢిల్లీలో ఒక కేసు నమోదైంది. అందులో సోనియాగాంధీ పౌరసత్వం పొందకముందే ఓటర్గా (Amit Shah) నమోదయ్యిందా అనే అంశం విచారణలో ఉంది,” అని అమిత్ షా సభలో వ్యాఖ్యానించారు.
అంతేకాకుండా, దేశ తొలి ప్రధాని ఎంపిక విషయంలో జవహర్లాల్ నెహ్రూ సర్దార్ పటేల్ను ఓటింగ్లో ఓడిపోయినా ప్రధాని అయ్యారని, అలాగే 1975లో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎన్నికను రద్దు చేసిన తరువాత, ప్రధానికి రక్షణ కల్పించేలా పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టిన ఘటనలను కూడా ఆయన ప్రస్తావించారు.
ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో, అమిత్ షా స్పందిస్తూ, “నేను ఏ నిర్ణయమూ తీసుకోలేదు. కోర్టులో కేసు ఉందని మాత్రమే చెప్పాను. దానికి సమాధానం ఇవ్వాల్సింది కోర్టులోనే,” అని అన్నారు.
కాంగ్రెస్ ఎంపీ కె.సి. వేణుగోపాల్ పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తుతూ, “1980లలో సోనియాగాంధీపై దాఖలైన కేసును కోర్టే కొట్టివేసింది. ఆమె ఆ ఎన్నికల్లో ఓటు కూడా వేయలేదు. హోంమంత్రి అసత్య ఆరోపణలు చేస్తున్నారు,” అని ఆరోపించారు.
అయితే అమిత్ షా తన వ్యాఖ్యలను సమర్థించుకుంటూ, “కేసు ఉందన్న వాస్తవాన్ని మాత్రమే చెప్పాను. తుది నిర్ణయం కోర్టే తీసుకుంటుంది,” అని స్పష్టం చేశారు. ఈ మాటలతో ఎన్నికల సంస్కరణలపై చర్చ మరోసారి ఘర్షణకు దారితీసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read also :