📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News: J&K: జమ్మూకశ్మీర్​కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం: అమిత్​ షా

Author Icon By Vanipushpa
Updated: October 18, 2025 • 5:10 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జమ్మూకశ్మీర్​కు తగిన సమయంలో రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్​ షా(Amithsha) హామీ ఇచ్చారు. లద్ధాఖ్​ కేంద్రపాలిత ప్రాంత ప్రజలు లేవనెత్తిన డిమాండ్లకు మంచి పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు. పట్నాలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన అమిత్​ షా, జమ్మూకశ్మీర్​పై కీలక వ్యాఖ్యలు చేశారు. “ఆర్టికల్​ 370 రద్దు తరువాత, ఉగ్రవాద ప్రభావిత జమ్మూకశ్మీర్​ మంచి మలుపు తీసుకుంది. గత తొమ్మిది నెలల్లో ఒక్క స్థానిక వ్యక్తి కూడా ఉగ్రవాద గ్రూప్​లో చేరలేదు. 1990ల నుంచి వేర్పాటువాదం చెలరేగుతూ ఉన్న జమ్మూకశ్మీర్​లో చూసిన గుణాత్మక మార్పు ఇది.

Read Also: Ashwini Vaishnav: గ్లోబల్ మార్కెట్లో సత్తా చాటుతున్న భారత్

J&K: జమ్మూకశ్మీర్​కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తాం: అమిత్​ షా

జమ్మూకశ్మీర్​లో ప్రజాస్వామ్యం

గతంలో పాకిస్థాన్​ మన సరిహద్దుల్లోకి వారి ఉగ్రవాదులను పంపాల్సిన అవసరం లేదని భావించేది. పాక్ మన పిల్లల చేతుల్లో ఆయుధాలు ఉంచి, మనకే వ్యతిరేకంగా పనిచేసేలా చేసేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జమ్మూకశ్మీర్​ ప్రజలు తాము భారతదేశం మొత్తానికి చెందిన వారమని, దేశం మొత్తం తమదని భావిస్తున్నారు. ఇప్పుడు జమ్మూకశ్మీర్​లో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడింది. ఇప్పటికే పంచాయితీ, మున్సిపల్, శాసనసభ ఎన్నికలు కూడా జరిగాయి. రాజ్యసభ ఎన్నికలు కూడా కొంతకాలం తరువాత జరుగుతాయి.” అని అమిత్​ షా అన్నారు

తగిన సమయంలో జమ్మూకశ్మీర్​కు రాష్ట్ర హోదా

ప్రమాణ స్వీకారం చేసి ఏడాది గడిచినా రాష్ట్ర హోదా పునరుద్ధరించకపోవడంపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలపై కూడా అమిత్​ షా స్పందించారు. “అతను (ఒమర్​ అబ్దుల్లా) రాజకీయపరమైన ఒత్తిడి వల్ల అలా చెబుతుండవచ్చు. కానీ జమ్మూకశ్మీర్​కు రాష్ట్ర హోదా తగిన సమయంలో పునరుద్ధరించబడుతుంది. అది కూడా అతనితో చర్చల తర్వాతనే జరుగుతుంది” అని అమిత్ షా స్పష్టం చేశారు.

న్యాయమైన డిమాండ్లు పరిష్కారం

మరోవైపు లద్ధాక్​లో ఇటీవల జరిగిన ఆందోళనల గురించి అమిత్​ షా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం “లేహ్​​, కార్గిల్​ కమిటీలతో చర్చలు” జరుపుతోందని అన్నారు. “ప్రజలు కాస్త ఓపికగా ఉండాలని మేము కోరుతున్నాం. వారి న్యాయమైన డిమాండ్లు అన్నింటికీ మంచి పరిష్కారం లభిస్తుంది” అని పేర్కొన్నారు. లద్ధాక్​ రాజకీయ, పౌర సమాజాలకు ప్రాతినిధ్యం వహించే లేహ్​ అపెక్స్ బాడీ, కార్గిల్​ డెమొక్రటిక్​ అలయన్స్​ సంయుక్త నాయకత్వంను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


అమిత్ షా నియోజకవర్గం?

గుజరాత్ రాజధాని గాంధీనగర్. ఇది భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి, మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, మాజీ ఉప ప్రధాన మంత్రి ఎల్.కె. అద్వానీ మరియు ప్రస్తుత హోం మంత్రి మరియు మాజీ బిజెపి చీఫ్ అమిత్ షా దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read Also:

Amit Shah latest speech Amit Shah on Jammu Kashmir Article 370 updates Jammu Kashmir statehood restoration Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.