📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Mamata Banerjee : పశ్చిమబెంగాల్‌ నిరసనలో ఆయన హస్తం ఉంది: మమతా బెనర్జీ

Author Icon By sumalatha chinthakayala
Updated: April 16, 2025 • 3:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Mamata Banerjee : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పై తీవ్ర ఆరోపణలు చేశారు. వక్ఫ్‌ (సవరణ) చట్టం-2025కి వ్యతిరేకంగా బెంగాల్‌లో జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారడంలో ఆయన హస్తం ఉందని ఆరోపించారు. ఇది ఒక పద్ధతి ప్రకారం జరిగిన హింస అని.. ఇందుకోసం అమిత్‌ షా, బీఎస్‌ఎఫ్‌ కలిసి కుట్రపూరితంగా బంగ్లాదేశీయులను రాష్ట్రంలోని వదిలారని వ్యాఖ్యానించారు. దర్యాప్తు సంస్థలను అస్త్రంగా చేసుకుని ప్రతిపక్ష నేతలను భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సొంత రాజకీయ అజెండాను నెరవేర్చుకోవడానికి దేశానికి హాని చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రధాని నరేంద్ర మోడీ. అమిత్‌షాను నియంత్రించాలని అన్నారు.

ఘర్షణల్లో బీఎస్‌ఎఫ్‌ పాత్రపై దర్యాప్తు

ఈ విషయంపై ప్రజలు శాంతియుత నిరసనలు చేపట్టాలని కోరారు. వక్ఫ్ సవరణ చట్టాన్ని అమలు చేయొద్దని ప్రధానిని కోరారు. హింసాకాండలో మరణించిన ముగ్గురు వ్యక్తుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల నష్ట పరిహారం ఇస్తామని మమత ఈ సందర్భంగా ప్రకటించారు. ఘర్షణల్లో బీఎస్‌ఎఫ్‌ పాత్రపై దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ముర్షిదాబాద్ అల్లర్ల వెనుక సరిహద్దు అవతల నుంచి వచ్చిన వ్యక్తుల పాత్ర ఉందని నిఘా వర్గాలు తమకు తెలిపాయని మమత పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల్లోని ఘర్షణలకు సంబంధించిన దృశ్యాలను బెంగాల్‌లో జరుగుతున్నట్లు చెబుతూ సోషల్‌ మీడియాలో కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని దీదీ ఆరోపించారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో తమ పార్టీ ముందంజలో ఉందని అన్నారు.

200 మందికి పైగా నిరసన కారులు అరెస్టు

కాగా, ఇటీవల వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హూగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముర్షిదాబాద్ ప్రాంతంలో పోలీసు వాహనాలకు నిప్పు పెట్టడం వంటి ఘటనలతో అక్కడ విధ్వంసం చోటుచేసుకుంది. దీంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి పైగా నిరసన కారులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా.. వక్ఫ్‌ సవరణ చట్టాన్ని సవాల్‌ చేస్తూ ఇప్పటికే పదుల సంఖ్యలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై సుప్రీంకోర్టు ఈ నెల 16న విచారణ చేపట్టనుంది.

Amit Shah Breaking News in Telugu Google news Google News in Telugu Latest News in Telugu Mamata Banerjee Paper Telugu News Telugu News Telugu News online Telugu News Today Today news West Bengal protest

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.