ఉపరాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు విపక్ష ఇండియా కూటమి (Alliance of India) లో తీవ్ర ప్రకపంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్టీఏ (NDA) అభ్యర్థికి ఊహించిన దానికంటే 14 ఓట్లు అదనంగా లభించడంతో కూటమి ఐక్యతపై మరోసారి సందేహాలు మొదయ్యాయి. ఈపరిణామం జాతీయ రాజకీయాల్లో తీవ్రచర్చకు దారితీసింది. ఇటీవల జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్టీఏ కూటమిఅభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) కు 452 ఓట్లు రాగా,
ఇండియా కూటమి తరపున బరిలో నిలిచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి (Justice Sudarshan Reddy) కి 300 ఓట్లు మాత్రమే లభించాయి. వాస్తవానికి ఎన్డీఏకు ఉన్న సంఖ్యాబలం కంటే 14 ఓట్లు ఎక్కువగా పోలవ్వడంతో విపక్షాలశిబిరంలో క్రాస్ ఓటింగ్ జరిగిందని స్పష్టమైంది. ఈ ఫలితాలు ఇండియా కూటమిలోని పార్టీల మధ్య తీవ్ర అపనమ్మకాన్నిసృష్టించాయి.
స్పందించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి
ఈ పరిణామాలపై ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డి స్పందించారు. క్రాస్ ఓటింగ్ (Cross voting) గురించి తాను ప్రత్యేకంగా మాట్లాడబోనని, జరిగిందంతా దేశ ప్రజలు గమనించారని ఆయన వ్యాఖ్యానించారు. పదవుల కోసం పార్టీలో చేరాల్సిన అవసరం తనకు లేదని ఓ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ అన్నారు. పోలింగ్ లో కొన్ని ఓట్లు చెల్లుబాటు కాకపోవడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని వ్యాఖ్యానించారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: