📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

అధికారులంతా వీఐపీల సేవలో నిమగ్నమయ్యారు: ప్రేమానంద్ పూరి

Author Icon By Vanipushpa
Updated: January 29, 2025 • 1:25 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో అపశుృతి జరిగింది. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు లక్షలమంది రావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 17 మంది మృతిచెందినట్లు సమాచారం. మరో 100 మంది భక్తులు గాయాలపాలైనట్లు తెలుస్తోంది. మహాకుంభమేళాలో తొక్కిసలాటపై ప్రముఖ మతాధికారి ప్రేమానంద్ పూరి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రయాగ్ రాజ్ లోని అధికార యంత్రాంగం భక్తుల భద్రతను గాలికొదిలేసిందని ఆరోపించారు. “అధికారులు వీఐపీ, ప్రముఖులకు సేవలు చేయడంలో నిమగ్నమయ్యారు. సాధారణ భక్తుల వద్ద పోలీసులు, అధికారులు ఎవరూ లేరు. నేను మహాకుంభమేళాకు వచ్చిన ప్రతి వీఐపీ వ్యక్తిని చూశాను. అందరికీ స్థానిక అధికారులు సపర్యలు చేశారు. అందుకే తొక్కిసలాట జరిగింది” అని ప్రేమానంద్ పూరీ మండిపడ్డారు.

మహాకుంభమేళా పర్యవేక్షణ ఏర్పాట్లను భారత ఆర్మీకి అప్పగిస్తే.. వాళ్లు సమర్థవంతంగా ఏర్పాట్లు చేసేవారని ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేవని ప్రేమానంద్ పూరీ అభిప్రాయపడ్డారు. పర్యవేక్షణ బాధ్యతలు ఇండియన్ ఆర్మీకు ఇవ్వాలని అఖాడాలు కూడా కోరుకుంటున్నారని అన్నారు. జనవరి 29 మౌని అమావాస్య సందర్భంగా లక్షల మంది భక్తులు తెల్లవారుజాము నుంచే గంగా- యమునా- సరస్వతి నదుల త్రివేణీ సంగమంలో అమృత స్నానాలు ఆచరించేందుకు ఎగబడ్డారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో దాదాపు 17 మంది వరకు మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు ఫోన్ చేసి తెలుసుకున్నారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మహాకుంభమేళాలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి

Maha Kumbh Mela Premanand Puri Stampede vips

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.