📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Latest Telugu News : Akhilesh Yadav : వందేమాతర గీతం స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అనుసరించాలి : అఖిలేష్‌ యాదవ్‌

Author Icon By Sudha
Updated: December 8, 2025 • 5:18 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

నాడు భారత స్వాతంత్య్ర సంగ్రామం లో పాల్గొనని వాళ్లు ఇప్పుడు వందేమాతరం గురించి, ఆ గీతం విలువల గురించి మాట్లాడుతున్నారని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ (Akhilesh Yadav) విమర్శించారు. లోక్‌సభలో వందేమాతరంపై చర్చలో పాల్గొన్న అఖిలేష్‌.. అధికార బీజేపీ నేతలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. వందేమాతరం జాతీయ గేయమని, ఆ గేయాన్ని ఒకరి నమ్మకాలను ఇతరులపై రుద్దే సాధనంగా వినియోగించడం కరెక్టు కాదని అఖిలేష్‌ యాదవ్‌ (Akhilesh Yadav) వ్యాఖ్యానించారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ లోక్‌సభలో చర్చ చేపట్టారు. వందేమాతర గీతం స్ఫూర్తిని ప్రతిఒక్కరూ అనుసరించాలని, స్వాతంత్య్ర పోరాటం సందర్భంగా ఈ గీతం ప్రజలను ఒక్కటి చేసిందని అన్నారు.

Read Also: http://Vande Mataram 150 years : డిసెంబర్ 8న లోక్‌సభలో ‘వందే మాతరం’పై చర్చకు ప్రధాని మోదీ శ్రీకారం…

Akhilesh Yadav

ఇవాళ కొన్ని విచ్ఛిన్నకర శక్తులు దేశాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం వందేమాతరం గీతాన్ని వాడుకుంటున్నాయని బీజేపీపై విమర్శలు చేశారు. వాళ్లు (బీజేపీ నేతలు) నాడు బ్రిటిష్ పాలకులు పాటించిన ‘విభజించు.. పాలించు’ పాలసీనే అనుసరిస్తున్నారని ఆరోపించారు.

అఖిలేష్ యాదవ్ డిగ్రీ?

ఆయన రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లోని ధోల్‌పూర్ మిలిటరీ స్కూల్‌లో విద్యనభ్యసించారు, తరువాత భారతదేశంలోని కర్ణాటకలోని మైసూర్ విశ్వవిద్యాలయంలో సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు. అఖిలేష్ యాదవ్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ విశ్వవిద్యాలయం నుండి పర్యావరణ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

akhilesh yadav Breaking News Indian Politics inspiration latest news Political News Telugu News Vande Mataram

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.