‘ఆపరేషన్ సిందూర్’ (‘Operation Sindoor’) సమయంలో తన అద్భుత వ్యూహబుద్ధితో, శక్తివంతమైన మాటలతో దేశవ్యాప్తంగా హీరోగా నిలిచిన ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్కి అరుదైన గౌరవం లభించింది. దేశ రక్షణలో చూపిన అపూర్వ సేవలకు గుర్తింపుగా ఆయనకు ‘సర్వోత్తమ యుద్ధ సేవా మెడల్’ లభించింది. ఇది దేశ అత్యున్నత యుద్ధ సేవా పురస్కారం కావడం విశేషం.79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గురువారం దేశ రక్షణ కోసం సేవలందించిన సైనికులకు పురస్కారాల జాబితా ఆమోదించారు. ఇందులో అవధేష్ కుమార్ (Avadhesh Kumar) పేరు ప్రత్యేకంగా వెలుగులోకి వచ్చింది.బీహార్కు చెందిన ఎయిర్ మార్షల్ అవధేష్ కుమార్ ప్రస్తుతం ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్గా సేవలందిస్తున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో శత్రు టార్గెట్లు గుర్తించి, అవి విజయవంతంగా అమలు కావడంలో ఆయన వ్యూహాత్మక మేధస్సు కీలకంగా నిలిచింది.
వాక్చాతుర్యంతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న నేత
ఆపరేషన్ సమయంలో మీడియా సమావేశాల్లో ఆయన ప్రదర్శించిన హుందా మాటలు దేశ ప్రజల మనసులు గెలుచుకున్నాయి. మే 13న జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రామచరితమానస్ నుంచి ఒక శ్లోకం ఉదాహరించి, “తెలివైనవారికి సైగ చేస్తే చాలు” అంటూ పరోక్షంగా పాకిస్థాన్కు గట్టి సందేశం పంపారు.ఒక విలేకరి “పాక్లోని కైరాణా హిల్స్పై దాడి చేశారా?” అని అడిగినపుడు, అవధేష్ కుమార్ జవాబు అందరినీ ఆశ్చర్యపరిచింది. “అక్కడ అణు కేంద్రాలున్నాయా? మీరు చెప్పకపోతే మాకు తెలియదే! కైరాణా హిల్స్పై దాడి చేయలేదు” అని బదులిచ్చారు. ఈ సమాధానం ఆయన చురుకుదనానికి నిదర్శనంగా నిలిచింది.
భారత సాయుధ దళాలకు గౌరవాలు వెల్లువెత్తిన వేళ
ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మొత్తం 127 శౌర్య పురస్కారాలు, 40 విశిష్ట సేవా పురస్కారాలకు రాష్ట్రపతి ఆమోదించారు. ఇందులో భాగంగా:
4 కీర్తి చక్ర.
15 వీర్ చక్ర.
16 శౌర్య చక్ర.
58 సేనా మెడల్స్.
26 వాయుసేనా పతకాలు.
7 సర్వోత్తమ యుద్ధ సేవా పతకాలు ఉన్నాయి.
గొప్ప నాయకత్వానికి దేశం సెల్యూట్ చేస్తోంది
అవధేష్ కుమార్ తన మేధస్సు, వ్యూహాత్మకతతో దేశం కోసం పోరాడారు. మీడియా ముందు చెప్పిన ఒక్కో మాట వెనక ఎన్నో యుద్ధ వ్యూహాలు దాగి ఉన్నాయి. ఆయన సేవలు యువ సైనికులకు ప్రేరణగా నిలుస్తున్నాయి. ఈ గౌరవం దేశం తరపున ఆయనకు ఇచ్చే సెల్యూట్ అని చెప్పడంలో సందేహం లేదు.
Read Also :