Airtel latest plans : టెలికాం రంగంలో వినియోగదారులకు మరో మార్పు ఎదురైంది. ప్రముఖ టెలికాం సంస్థ Bharti Airtel తన ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్లతో ఇస్తున్న ఉచిత ఏఐ సబ్స్క్రిప్షన్ ఆఫర్ను నిలిపివేసింది. ఇకపై రీఛార్జ్ చేసే వినియోగదారులకు Perplexity AI ప్రో సబ్స్క్రిప్షన్ ఉచితంగా అందుబాటులో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.
గత ఏడాది వినియోగదారులను ఆకట్టుకునేందుకు పెర్ప్లెక్సిటీ ప్రో సేవలను వేల రూపాయల విలువతో ఉచితంగా అందించిన ఎయిర్టెల్, ఈ ఆఫర్ పరిమిత కాలానికే వర్తిస్తుందని ముందుగానే తెలిపింది. 2026 జనవరి 16తో గడువు ముగియడంతో ఈ సదుపాయాన్ని ప్రీపెయిడ్ ప్లాన్ల నుంచి తొలగించింది.
Read Also: T20 WC: ఫైనల్లో భారత్తో తలపడాల్సి వస్తే ఏం చేస్తారు? పాక్కు మాజీల ప్రశ్న!
అయితే, ఇప్పటికే ఆఫర్ను క్లెయిమ్ చేసుకున్న వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కంపెనీ పేర్కొంది. వారు యాక్టివేషన్ తేదీ నుంచి ఒక సంవత్సరం పాటు సేవలను కొనసాగించవచ్చు. కొత్తగా రీఛార్జ్ చేసే వారికి మాత్రం ఈ సదుపాయం ఇక లభించదు.
ఇదిలా ఉండగా, వినియోగదారులకు మరో ప్రత్యామ్నాయాన్ని ఎయిర్టెల్ అందిస్తోంది. తాజాగా Adobeతో భాగస్వామ్యం కుదుర్చుకుని Adobe Express ప్రీమియం సేవలను ఉచితంగా ఇవ్వనుంది. సాధారణంగా సంవత్సరానికి వేల రూపాయలు ఖర్చయ్యే ఈ సబ్స్క్రిప్షన్ ద్వారా జనరేటివ్ ఏఐ ఫీచర్లు, డిజైన్ టూల్స్ వంటి అనేక ప్రీమియం సదుపాయాలు వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: