📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Air India scam: 4,000 మంది ఉద్యోగులపై వేటు

Author Icon By Vanipushpa
Updated: March 16, 2026 • 4:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఎయిర్ ఇండియాలో కొత్త మోసం వెలుగులోకి వచ్చింది. ఎయిర్ ఇండియాలో దశాబ్దాలుగా సాగుతున్న ఒక అక్రమ దందా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. సంస్థ ఉద్యోగులకు లభించే ఫ్రీ ప్యాసేజ్ (Free Passage) సౌకర్యాన్ని దుర్వినియోగం చేస్తూ, వేల సంఖ్యలో ఉద్యోగులు అక్రమాలకు పాల్పడినట్లు తేలింది. సుమారు 4,000 మంది ఉద్యోగులు తమకు కేటాయించిన ఉచిత టిక్కెట్లను బయటి వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు అంతర్గత విచారణలో వెల్లడైంది. దర్యాప్తు తర్వాత ఎయిర్ ఇండియా(Air India) మోసానికి పాల్పడిన ఉద్యోగులపై చర్యలకు సిద్ధపడింది.

Read Also: Gas Shortage: హైదరాబాద్‌లో గ్యాస్ సంక్షోభం..ప్రతిరోజూ కోట్లలో నష్టం

Air India scam: 4,000 employees sacked

టిక్కెట్లను భారీ ధరలకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది

విమానయాన సంస్థలు తమ సిబ్బందికి ప్రోత్సాహకంగా ఏడాదికి కొన్ని ఉచిత టిక్కెట్లను ఇస్తాయి. ఇవి కేవలం ఉద్యోగికి లేదా వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు మాత్రమే వర్తిస్తాయి. కానీ, ఎయిర్ ఇండియాలోని కొందరు సిబ్బంది ఏజెంట్లతో కుమ్మక్కై, ఈ టిక్కెట్లను అపరిచితులకు విక్రయించారు. విదేశీ ప్రయాణాలకు డిమాండ్ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ టిక్కెట్లను భారీ ధరలకు అమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఎయిర్ ఇండియా బాధ్యతలను టాటా గ్రూప్ స్వీకరించిన తర్వాత, సంస్థలోని ప్రతి విభాగాన్ని డిజిటలైజ్ చేస్తూ పారదర్శకతను పెంచుతోంది. ఈ క్రమంలోనే పాత రికార్డులను, టిక్కెట్ బుకింగ్ విధానాలను పరిశీలించగా ఈ భారీ అవకతవకలు బయటపడ్డాయి. ఏళ్ల తరబడి సాగుతున్న ఈ దందా వల్ల సంస్థ ఆదాయానికి గండి పడటమే కాకుండా, నైతిక విలువలు దెబ్బతిన్నాయని యాజమాన్యం భావిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Air India fraud investigation Air India scam aviation industry news Employee Termination mass layoffs 2026 Tata Group Air India Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.