📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Air India: అహ్మదాబాద్​లో కుప్ప కూలిన ఎయిరిండియా విమానం..కొనసాగుతున్న సహాయం

Author Icon By Sharanya
Updated: June 12, 2025 • 3:37 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ (Ahmedabad) నగరంలో జరిగిన ఒక ఘోర విమాన ప్రమాదం ఆ ప్రాంతాన్ని కలకలం రేపుతోంది. ఎయిర్ ఇండియాకు (Air India) చెందిన B787 డ్రీంలైనర్ విమానం, లండన్‌కు బయలుదేరిన కొద్ది క్షణాలకే తక్షణమే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో కలిపి ప్రయాణిస్తున్నారు.

ప్రమాదానికి ముందు పరిస్థితి

ఎయిర్​ ట్రాఫిక్ కంట్రోల్​(ఏటీసీ) అధికారులు చెప్పిన వివరాల ప్రకారం, అహ్మదాబాద్ నుంచి మధ్యాహ్నం 1.39 గంటలకు రన్‌వే 23 నుంచి బయలు దేరింది. కొద్ది సేపటి తర్వాత విమానం ఏటీసీకి అందుబాటులోకి రాలేదు. విమానం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. అధికారులు పరిశీలించగా ఎయిర్​పోర్టు సమీపంలో కూలిపోయినట్లు అధికారులు గుర్తించారు.

ఘటనా స్థలంలో ఘోరం

అహ్మదాబాద్​లోని మేఘనినగర్ ప్రాంతానికి సమీపంలోని ధార్పూర్ వద్ద ప్రమాదం జరిగింది. ఘటన అనంతరం విమానం నుంచి భారీ పొగలు రావడంతో అటు ఎయిర్​ఇండియా, ఇటు ఎయిర్​పోర్టు అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదానికి గల కారణాన్ని అధికారులు ఇంకా నిర్ధారించలేదు. ఎన్‌డీఆర్‌ఎఫ్, బీఎస్‌ఎఫ్ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టాయి.

అధికారుల స్పందన

ఈ ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్‌తో మాట్లాడారు. ఈ సంఘటన తర్వాత, అహ్మదాబాద్ చుట్టుపక్కల ఉన్న అన్ని ఆసుపత్రులను అప్రమత్తం చేశారు.

ప్రమాద సమయంలో విమానంలో 2 పైలట్లు, 10 మంది క్యాబిన్ సిబ్బందితో సహా 242 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ విమానం పైలెట్ కెప్టెన్ సుమీత్ సభర్వాల్​కు 8200 గంటల పాటు విమానం నడిపిన అనుభవం ఉన్నట్లు తెలిపారు.

Plane Crash: విమాన ప్రమాదంలో 242 మంది ప్ర‌యాణికులు : పోలీసు కంట్రోల్ రూమ్‌

#AhmedabadCrash #AirIndia #AirIndiaAccident #Flightaccident Breaking News in Telugu Breaking News Telugu epaper telugu google news telugu Latest News Telugu Latest Telugu News News Telugu News Telugu Today Telugu Epaper Telugu News Telugu News Paper Telugu News Paper Online Telugu News Today Today News Telugu Today News Telugu Paper Today Rasi Phalalu in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.