📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..? ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం ఆధార్, మొబైల్ లింక్ పై కీలక అప్ డేట్ డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం కొత్త కార్యక్రమాలు బాలికల కోసం ప్రభుత్వ పథకాలు కర్ణాటకలో బైక్‌ ట్యాక్సీలపై నిషేధం ఎత్తివేత ఆధార్ కార్డు పోయిందా..?

Air India : ఎయిర్ ఇండియా విమానంలో అసహ్యకర ఘటన…

Author Icon By Divya Vani M
Updated: April 9, 2025 • 9:22 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఢిల్లీ నుంచి బ్యాంకాక్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఆశ్చర్యకర సంఘటన జరిగింది.బిజినెస్ క్లాస్‌లో ఓ ప్రయాణికుడు మద్యం మత్తులో అదుపు కోల్పోయాడు.తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేయడం అందరిని షాక్‌కు గురిచేసింది.ఈ ఘటన విమానం ల్యాండింగ్‌కు కొద్దిసేపటి ముందు జరిగింది.ఎయిర్ ఇండియా ఈ ఘటనను అధికారికంగా ధృవీకరించింది.సిబ్బంది తక్షణమే స్పందించి నిబంధనల మేరకు చర్యలు తీసుకున్నారని వెల్లడించింది బాధితుడు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని అధికారులు పేర్కొన్నారు. అయితే ఎయిర్ ఇండియా అంతర్గత కమిటీ విచారణ ప్రారంభించింది.నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది.AI-2336 ఫ్లైట్ ఢిల్లీ నుంచి బయలుదేరి బ్యాంకాక్ వెళ్తోంది.బిజినెస్ క్లాస్‌లో ప్రయాణిస్తున్న వ్యక్తి మద్యం మోతలో అదుపు తప్పాడు.తన పక్కనే ఉన్న ప్రయాణికుడిపై మూత్రం పోశాడు.

Air India ఎయిర్ ఇండియా విమానంలో అసహ్యకర ఘటన

విమాన సిబ్బంది వెంటనే స్పందించి, అతడిని హెచ్చరించారని తెలిపారు.బాధితుడికి అధికారుల ఫిర్యాదుకి సహాయం అందించామని వెల్లడించారు.కానీ బాధితుడు ఫిర్యాదు చేయకపోవడంతో కేసు ముందుకెళ్లలేదు.ఇలాంటి దుశ్చర్య 2022 నవంబర్లోనూ జరిగింది.న్యూయార్క్ నుంచి ఢిల్లీకి వచ్చే విమానంలో ఓ ప్రయాణికుడు వృద్ధురాలిపై మూత్రం విసిరాడు.ఆ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమైంది.ఆ ప్రయాణికుడిపై ఎయిర్ ఇండియా నిషేధం విధించింది. అలాగే ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.ఇలాంటి ఘటనలు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. మద్యం సేవనపై నిఘా పెంచింది.ప్రయాణికుడు మద్యం తాగాక అదుపులో ఉంటేనే మళ్లీ అందించాలన్నది తాజా ఆదేశం. ఢిల్లీ-థాయిలాండ్ విమానాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా ఉంటున్నట్లు గుర్తించారు.ఎయిర్ ఇండియా ఇప్పుడు కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తోంది ప్రయాణికుల భద్రతకు ఇది అత్యవసరంగా భావిస్తోంది.

Air India Alcohol Policy Air India Incident Air India Internal Committee Passenger Misbehaviour Tirupati-Katpadi Railway

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.