📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Telugu News: Sadhaguru jaggi Vasudav -సద్గురు జగ్గీవాసుదేవ్ పేరిట ఎఐ విడియో.. మహిళకు రూ.3.75 కోట్ల టోకరా

Author Icon By Sushmitha
Updated: September 13, 2025 • 10:56 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరు:(Bangalore) ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు జగ్గీ వాసుదేవ్(Sadhaguru jaggi Vasudav) సద్గురు జగ్గీవాసుదేవ్ పేరిట ఎఐ విడియో.. మహిళకు రూ.3.75 కోట్ల టోకరా పేరుతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)(Artificial intelligence) వీడియోను రూపొందించిన సైబర్ నేరగాళ్లు, బెంగళూరులో ఒక మహిళను రూ.3.75 కోట్ల మేర మోసం చేశారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బెంగళూరులోని సి.వి. రామన్ నగర్‌కు చెందిన వర్ష గుప్తా అనే మహిళ ఫిబ్రవరి 25న యూట్యూబ్(Youtube)చూస్తుండగా, సద్గురు జగ్గీ వాసుదేవ్‌కు సంబంధించిన ఒక వీడియో కనిపించింది. ఆ వీడియోలో, 250 డాలర్ల పెట్టుబడితో ఒక ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్‌లో చేరితే ఎక్కువ లాభాలు పొందవచ్చని సద్గురు చెబుతున్నట్లు ఉంది.

AI వీడియోతో మోసం

డీప్‌ఫేక్ టెక్నాలజీ(Technology) గురించి అవగాహన లేకపోవడంతో, ఆ వీడియో అసలైనదేనని నమ్మిన వర్ష గుప్తా, వీడియో కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేశారు. దీంతో ఆమెకు వలీద్ అనే వ్యక్తి ఫోన్ చేసి, తనను తాను మిరాక్స్ యాప్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్నాడు. విదేశీ ఫోన్ నంబర్లు, ఈమెయిల్స్ ఉపయోగించి ఆమెతో మాట్లాడిన ఆ వ్యక్తి, మిరాక్స్ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించాడు. ఆ తర్వాత మైఖేల్ అనే మరో వ్యక్తి కూడా ఆ యాప్‌ను నమ్మవచ్చని ఆమెకు భరోసా ఇచ్చాడు. వీరి మాటలను నమ్మిన వర్ష, పలు దఫాలుగా తన ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాలకు రూ.3.75 కోట్లను బదిలీ చేసింది. చివరికి ఆమె మిరాక్స్ యాప్ గురించి ఆరా తీయగా, అది నకిలీదని తెలిసి మోసపోయానని గ్రహించారు. దీంతో ఆమె బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

మోసానికి గురైన మహిళ ఎంత మొత్తం కోల్పోయారు?

ఆమె పలు దఫాలుగా రూ.3.75 కోట్లు మోసగాళ్లకు బదిలీ చేశారు.

ఈ మోసంలో ఏ సాంకేతికతను ఉపయోగించారు?

సద్గురు జగ్గీ వాసుదేవ్ ముఖాన్ని, గొంతును ఉపయోగించి ఏఐ డీప్‌ఫేక్ వీడియోను సృష్టించి మోసం చేశారు.


Read hindi news: hindi.vaartha.com

Read also:

News telugu: Renu Desai: సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన రేణూ దేశాయ్ వ్యాఖ్యలు

AI deepfake bengaluru Cyber Crime cyber police. Google News in Telugu Latest News in Telugu Online Fraud Sadguru Jaggi Vasudev Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.