📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

AI: ఏఐతో లింగ నిర్ధారణ? భారత్‌లో కలకలం రేపుతున్న కొత్త ట్రెండ్

Author Icon By Vanipushpa
Updated: February 6, 2026 • 3:07 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

సాధారణంగా మనదేశంలో పుట్టబోయే బిడ్డ ఆడా? మగా? అనేది ముందుగానే తెలుసుకోవడం చట్టరీత్యా నేరం. అయితే ఇప్పుడు ఆ పనిని ఏఐ సాయంతో గుట్టు చప్పుడు కాకుండా చేసేస్తున్నారట. స్కానింగ్ రిపోర్టులను ఏఐలో అప్ లోడ్ చేసి.. లింగ నిర్ధారణ చేస్తున్నారట. ప్రస్తుతం దీని గురించిన పోస్ట్ ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ (Viral) అవుతుంది. అదేంటంటే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో డాక్టర్ సిద్ధాంత్ భార్గవ చేసిన ఒక పోస్ట్ విపరీతంగా వైరల్ అవుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అనేది మన జీవితాలను సులభతరం చేస్తోందని మనందరికీ తెలుసు. కానీ, భారతదేశంలో కొందరు తల్లిదండ్రులు ఈ టెక్నాలజీని చాలా ప్రమాదకరమైన, అనైతికమైన పని కోసం వాడుతున్నారనే వార్త ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. అల్ట్రాసౌండ్ లేదా సోనోగ్రఫీ చిత్రాలను ఏఐ టూల్స్‌కు అప్‌లోడ్ చేసి.. పుట్టబోయే బిడ్డ ఆడ లేక మగ అని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారనే అంశంపై ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది.

Read Also: Ola Uber Rapido Strike: రేపు దేశవ్యాప్త క్యాబ్ మరియు బైక్ టాక్సీల సమ్మె

AI: ఏఐతో లింగ నిర్ధారణ? భారత్‌లో కలకలం రేపుతున్న కొత్త ట్రెండ్

డాక్టర్ల మీద నిఘా

దశాబ్దాలుగా మన దేశంలో నెలకొన్న లింగ వివక్షను, భ్రూణ హత్యలను అరికట్టడానికి ఈ కఠినమైన చట్టాలను తెచ్చారు. గతంలో స్కానింగ్ సెంటర్లు, డాక్టర్ల మీద నిఘా ఉండేది. కానీ, ఇప్పుడు ఎవరికీ తెలియకుండా ఒక స్మార్ట్‌ఫోన్, ఏఐ సహాయంతో ఈ సమాచారాన్ని పొందేందుకు కొందరు ప్రయత్నిస్తుండటం వ్యవస్థకే సవాలుగా మారింది. నెటిజన్ల స్పందన, సాంకేతిక వాస్తవాలు ఈ వైరల్ పోస్ట్‌పై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది సాంకేతికంగా సాధ్యం కాదని వాదిస్తున్నారు. రేడియాలజిస్ట్ పరిశీలన: మన దేశంలో డాక్టర్లు స్కానింగ్ చేసేటప్పుడు బిడ్డ జననాంగాలకు సంబంధించిన చిత్రాలను ఎక్కడా స్టోర్ చేయరు. ఆ సమాచారం చిత్రాల్లో లేనప్పుడు ఏఐ కూడా లింగాన్ని గుర్తించలేదని కొందరు నిపుణులు చెబుతున్నారు.

ఫోటోలను అప్‌లోడ్ చేస్తే వాటిని బ్లాక్ చేసేలా ఫిల్టర్లు

నియంత్రణ అవసరం: ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు భారతీయ చట్టాలను గౌరవించాలని, భారత్ నుండి ఎవరైనా ఇటువంటి ఫోటోలను అప్‌లోడ్ చేస్తే వాటిని బ్లాక్ చేసేలా ఫిల్టర్లు ఉండాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ల బాధ్యత: లైవ్ స్కాన్ చేసేటప్పుడు తల్లిదండ్రులకు కొన్ని భాగాలు కనిపించకుండా డాక్టర్లు జాగ్రత్త వహించాలని, సెన్సిటివ్ మెడికల్ డేటా విషయంలో కఠినమైన నిబంధనలు ఉండాలని కోరుతున్నారు. కనిపించని విపత్తు కానీ, దానిని వాడే మనుషుల ఉద్దేశాన్ని బట్టి ఫలితాలు మారుతుంటాయి. ఏఐకి భారతీయ సామాజిక చరిత్ర తెలియదు, లింగ వివక్ష వల్ల కలిగే నష్టాలు తెలియవు. అది కేవలం ప్యాటర్న్స్‌ను గుర్తిస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

AI technology AI trend in India Artificial intelligence Data Privacy digital surveillance ethical concerns Facial Recognition gender identification machine learning Telugu News Paper Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.