📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Aga Syed Ruhullah Mehdi: శ్రీనగర్ ఎంపీ అగా సయ్యద్ పై కేసు నమోదు? సోషల్ మీడియా పోస్టులే కారణమా!

Author Icon By Anusha
Updated: March 4, 2026 • 12:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Aga Syed Ruhullah Mehdi: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన వార్త జమ్మూ కాశ్మీర్‌లో తీవ్ర సంచలనం సృష్టించింది. ఖమేనీ మృతికి సంతాపం ప్రకటిస్తూ కాశ్మీర్ లోయలోని షియా ముస్లింలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీలు నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఈ క్రమంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Read Also: Ownly Food Delivery: జొమాటో, స్విగ్గీలకు పోటీగా ర్యాపిడో ‘ఓన్లీ’

మాజీ మేయర్‌పై కూడా కేసు

ఈక్రమంలోనే పలువురు ఈ నిరసనలకు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. తాజాగా శ్రీనగర్ లోక్‌సభ ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహదీ కూడా ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసారు.. దీంతో పోలీసులు ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేశారనే ఆరోపణలతో కేసు పెట్టారు. ఎంపీతో పాటు శ్రీనగర్ మాజీ మేయర్ జునైద్ అజీమ్ మట్టూపై కూడా కేసులు నమోదు అయ్యాయి.

లోయలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా.. ఎంపీ అగా సయ్యద్ రుహుల్లా మెహదీ, మాజీ మేయర్ జునైద్ అజీమ్ మట్టూ తప్పుడు వీడియోలను పోస్ట్ చేశారని పోలీసులు పేర్కొన్నారు.ఈక్రమంలోనే వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత కింద దేశ సార్వభౌమాధికారం, సమగ్రతకు భంగం కలిగించడం, తప్పుడు సమాచారాన్ని ప్రచురించడం వంటి తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు పెట్టారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Jammu Kashmir Protests Khamenei Death Junaid Azim Mattu Case Srinagar MP Aga Syed Ruhullah Mehdi FIR

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.