దేశవ్యాప్తంగా కల్తీ పాల ఉదంతాలు పెరుగుతుండటంపై భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) తీవ్రంగా స్పందించింది. ప్రజారోగ్యానికి ముప్పుగా మారుతున్న ఈ కల్తీని అరికట్టేందుకు తాజాగా కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇకపై డెయిరీ కోఆపరేటివ్ సొసైటీలలో సభ్యులుగా ఉన్నవారు మినహా, ప్రతి పాల ఉత్పత్తిదారుడు మరియు విక్రయదారుడు తప్పనిసరిగా FSSAI రిజిస్ట్రేషన్ లేదా లైసెన్స్ కలిగి ఉండాలని ఆదేశించింది. పాలను విక్రయించే చిన్న వర్తకుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు అందరూ ప్రభుత్వ నిఘా నీడలోకి రావాలని, దీనివల్ల కల్తీ జరిగినప్పుడు బాధ్యులను గుర్తించడం సులభతరమవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
Read Also : Allu Cinemas Launch: లారీల్లో వెళ్లి సినిమాలు చూసేవాళ్లం: సీఎం రేవంత్
ఈ నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు రాష్ట్రాల ఆహార భద్రతా అధికారులకు FSSAI కీలక సూచనలు చేసింది. క్షేత్రస్థాయిలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి, నాణ్యతా ప్రమాణాలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. లైసెన్స్ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ లేకుండా వ్యాపారం సాగిస్తున్న వారిపై భారీ జరిమానాలు విధించడంతో పాటు, అవసరమైతే క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. పాలల్లో యూరియా, డిటర్జెంట్లు వంటి హానికర రసాయనాలు కలుపుతున్న ముఠాలను అడ్డుకోవడమే లక్ష్యంగా ఈ కొత్త విధివిధానాలను రూపొందించారు. ఈ నిర్ణయం వల్ల పాల సరఫరా వ్యవస్థలో పారదర్శకత పెరిగి, సామాన్యులకు స్వచ్ఛమైన పాలు అందుతాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :