📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు.. 12 మంది మృతి ఇండోర్‌లో కలుషిత తాగునీరు కల్లోలం నేటి నుంచే భారత్ టాక్సీ సేవలు ప్రారంభం

Abhishek Banerjee : లోక్‌సభ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలి : అభిషేక్‌ బెనర్జీ

Author Icon By Sudha
Updated: August 12, 2025 • 3:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

దేశంలో ఓట్ల చోరీ వ్యవహారం దుమారం రేపుతోంది. ఓట్ల చోరీ దుమారం వేళ.. తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ (Abhishek Banerjee) తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. లోక్‌సభ (Lok Sabha) ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ‘గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సరిగ్గానే ఉందని.. పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, తమిళనాడులో మాత్రమే తప్పుగా ఉన్నాయని ఈసీ చెబుతోంది. ఈసీ అలా ఎలా చెబుతుంది..? తప్పుడు ఓటర్ల జాబితాను ఉపయోగించే బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ల జాబితా నిర్వహిస్తే అది దేశవ్యాప్తంగా జరగాలి. అంతకంటే ముందు లోక్‌సభను రద్దు చేయాలి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గం రాజీనామా చేయాలి. నేను కూడా రాజీనామా చేసేందుకు సిద్ధమే. తృణమూల్‌తో పాటు ప్రతిపక్ష ఎంపీలందరూ అందుకు సిద్ధమే. ప్రస్తుత లోక్‌సభను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి’ అని అభిషేక్‌ బెనర్జీ (Abhishek Banerjee)డిమాండ్‌ చేశారు.

Abhishek Banerjee : లోక్‌సభ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలి : అభిషేక్‌ బెనర్జీ


బీజేపీ, కేంద్ర ఎన్నికల సంఘం కుమ్మక్కై ఎన్నికల్లో భారీ మోసానికి పాల్పడ్డాయని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్షనేత రాహుల్‌గాంధీ కొద్ది రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై నిన్న విపక్ష ఇండియా కూటమి ఎంపీలు ఢిల్లీలో ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే. బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ, ఓట్‌ చౌర్యానికి వ్యతిరేకంగా పార్లమెంట్‌ హౌస్‌ నుంచి ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వరకు సోమవారం ప్రతిపక్ష ఎంపీలు నిరసన ర్యాలీ చేపట్టారు. ఎన్నికల కమిషన్‌ కార్యాలయం వరకు ప్రతిపక్ష ఎంపీలు వెళ్లకుండా మధ్యలోనే పీటీఐ భవనం వెలుపల బారికేడ్లు వేసి అడ్డుకోవడంతో అక్కడే రోడ్డుపై బైఠాయించి ఎంపీలు నిరసన తెలిపారు. టీఎంసీ ఎంపీ మహువా మొయిత్ర, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ తదితరులు బారికేడ్లు ఎక్కి ఎన్నికల కమిషన్‌కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం రోడ్డు పక్కన వరసగా నిలిపి ఉంచిన బస్సులలో ఎంపీలను బలవంతంగా ఎక్కించిన పోలీసులు వారిని పార్లమెంట్‌ వీధి పోలీసు స్టేషన్‌కు తరలించారు. కొద్దిసేపటి తర్వాత ఎంపీలు అందరినీ పోలీసులు విడిచిపెట్టారు.

అభిషేక్ బెనర్జీ కుటుంబ నేపథ్యం?

అభిషేక్ బెనర్జీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు. ఆయన శాండిల్య గోత్రం నుండి బెంగాలీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఆయన భారతదేశంలోని కోల్‌కతాలో పుట్టి పెరిగారు. బెనర్జీ కోల్‌కతాలోని నవ నలంద హై స్కూల్ మరియు MP బిర్లా ఫౌండేషన్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లో చదువుకున్నారు.

అభిషేక్ బెనర్జీ కాస్టింగ్ కంపెనీ పేరు ఏమిటి?

ముంబై శివారులోని ఆరామ్ నగర్ రద్దీగా ఉండే సందులలో, సహ వ్యవస్థాపకులు అభిషేక్ బెనర్జీ మరియు అన్మోల్ అహుజా కాస్టింగ్ బే అనే సంస్థను నిర్వహిస్తున్నారు, ఇది చలనచిత్రాలు, ప్రకటనలు మరియు వెబ్ షోలకు పాత్రలను ఎంపిక చేయడంలో గర్వంగా ఉంది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/bilawal-bhutto-war-threats-against-india/international/529342/

Abhishek Banerjee Breaking News Indian Politics latest news Lok Sabha Elections Re-election Demand Telugu News TMC Trinamool

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.