📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె రైలు ఆలస్యమైతే ఉచిత భోజనం, పూర్తి రీఫండ్.. కొత్త లేబర్ కోడ్స్ ఎఫెక్ట్.. కార్పోరేట్ రంగం విలవిల అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్‌.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ నేటి నుంచి గుజరాత్లో ప్రధాని మోదీ పర్యటన ఈనెల 17న వందే భారత్ స్లీపర్ ప్రారంభం Budget 2026: రికార్డు సృష్టించనున్న నిర్మలా సీతారామన్ LIC లో కొత్త స్కిం .. బెనిఫిట్స్ అదిరిపోయాయి !! మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌ జనవరి చివర్లో బ్యాంకింగ్ సేవలకు బంద్ జనవరి 27న బ్యాంక్ ఉద్యోగుల సమ్మె

Alert to Clients: ఇకపై ఆధార్ ఓటీపీ చెల్లదు.. RBI కొత్త రూల్స్ ఇవే!

Author Icon By Vanipushpa
Updated: January 13, 2026 • 3:29 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుత డిజిటల్ యుగంలో బ్యాంకింగ్ సేవలు మన అరచేతిలోకి వచ్చేశాయి. కేవలం స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఇంటి నుండి బయటకు వెళ్లకుండానే నిమిషాల్లో బ్యాంక్ ఖాతాను తెరిచే సదుపాయం అందుబాటులో ఉంది. అయితే ఈ సులభతరమైన పద్ధతే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతోంది. కేవలం ఆధార్ ఓటీపీ (e-KYC) ఆధారంగా ఖాతాలు తెరిచే విధానాన్ని ఆసరాగా చేసుకుని, కేటుగాళ్లు ఇతరుల పేర్లతో ‘మ్యూల్ ఖాతాలను’ సృష్టించి కోట్లాది రూపాయల మోసాలకు పాల్పడుతున్నారు. ఈ ముప్పును గుర్తించిన బ్యాంకులు ఇప్పుడు తమ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్నాయి. ఆధార్ ఓటీపీ విధానంలో ఉన్న లోపం ఏమిటి? ఇప్పటివరకు ఆధార్‌ తో అనుసంధానమైన మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీని నమోదు చేస్తే సులభంగా ఖాతా ప్రారంభమయ్యేది. కానీ, ఈ పద్ధతిలో ఆధార్ వివరాలు ఉన్న వ్యక్తి నిజంగా ఆయనేనా? లేదా ఆ వివరాలను మరెవరైనా వాడుతున్నారా? అనేది బ్యాంక్ అధికారులకు తెలిసే అవకాశం లేదు. కేవలం డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే చాలు అకౌంట్ ఓపెన్ అయిపోయేది. దీన్ని అడ్డుకోవడానికి బ్యాంకులు ఇప్పుడు వీడియో కైవైసీ (Video KYC) ని తప్పనిసరి చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.

Read Also: TCS Results: టీసీఎస్‌ లాభం రూ.10657 కోట్లు..

Alert to Clients: ఇకపై ఆధార్ ఓటీపీ చెల్లదు.. RBI కొత్త రూల్స్ ఇవే!

మోసం చేయడం అసాధ్యం

వీడియో కేవైసీ (Video KYC) ఎలా పనిచేస్తుంది? ఈ విధానంలో కేవలం డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయడం సరిపోదు. బ్యాంక్ ప్రతినిధితో వీడియో కాల్‌లో నేరుగా మాట్లాడాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఖాతాదారుడు తన ఒరిజినల్ ఆధార్, పాన్ కార్డులను కెమెరా ముందు చూపించాల్సి ఉంటుంది. అంతేకాకుండా, సదరు వ్యక్తి ఎక్కడి నుండి మాట్లాడుతున్నారో వారి ‘లైవ్ లొకేషన్’ రికార్డు అవుతుంది. దీనివల్ల డీప్‌ ఫేక్ వీడియోలు లేదా ఇతరుల ఫోటోలను ఉపయోగించి మోసం చేయడం అసాధ్యం అవుతుంది. గ్రామీణ ప్రాంతాల కోసం ‘అసిస్టెడ్ కేవైసీ’ స్మార్ట్‌ఫోన్ వాడడం రాని వారు లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారి కోసం ‘అసిస్టెడ్ వీడియో కేవైసీ’ సదుపాయాన్ని బ్యాంకులు కల్పిస్తున్నాయి. గతంలో కేవలం ఓటీపీ ద్వారా తెరిచిన ఖాతాలకు లావాదేవీల పరిమితి ఉండేది, కానీ, వీడియో కేవైసీ (Video KYC) పూర్తి చేసిన వెంటనే ఆ ఖాతా పూర్తిస్థాయిలో పనిచేస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Aadhaar authentication changes Aadhaar OTP banking regulations India digital banking security Financial Safety online transactions RBI New Rules Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.