పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ (Bengal Assembly) ఎన్నికలకి ఏడాదిలోపు సమయం మాత్రమే మిగిలి ఉంది. కానీ ఇప్పుడే రాష్ట్రంలో రాజకీయ ఉష్ణోగ్రతలు గట్టిగా పెరిగాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) మధ్య మాటల యుద్ధం తీవ్రంగా ముదిరింది.అలీపుర్దువార్లో జరిగిన బహిరంగ సభలో మోదీ మాటల్లో ఊపు కనిపించింది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. టీఎంసీ సర్కార్కి అవినీతి పుటల పూసారని, బీదరికం, నిరుద్యోగం పెరిగిపోతున్నాయని ఆరోపించారు. హింస, అరాచకంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, రాష్ట్రం ఇప్పుడు మార్పు కోరుకుంటుందని అన్నారు. ముర్షిదాబాద్, మాల్దాలలో జరిగిన మత ఘర్షణలను ప్రస్తావిస్తూ, ఈ విధ్వంసానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనన్నారు.మోదీ తన ప్రసంగంలో మరో కీలకమైన అంశాన్ని ప్రస్తావించారు — ఉపాధ్యాయ నియామక కుంభకోణం. దీని వల్ల వేలాది కుటుంబాల భవిష్యత్తు దెబ్బతిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బెంగాల్లో న్యాయం కోసం కోర్టుల సహాయం అవసరం కావడం దురదృష్టకరమన్నారు.
ఉగ్రవాదం, సిందూర్ రాజకీయాలు? మమతా ఘాటైన బదులు
ప్రధాని విమర్శలపై మమతా బెనర్జీ తక్కువ తీసుకోలేదు. మోదీ వ్యాఖ్యలు బాధ కలిగించాయని ఆమె తెలిపారు. దేశం ఉగ్రవాదంపై పోరాడుతున్న సమయంలో “ఆపరేషన్ సిందూర్” వంటి విషయాల్ని రాజకీయ లబ్ధి కోసం వాడకూడదని మండిపడ్డారు. ధైర్యముంటే రేపే ఎన్నికలు నిర్వహించమని సవాల్ విసిరారు. “రాష్ట్ర ప్రజలు నన్ను నమ్ముతున్నారు” అని ఆమె ధీమాగా అన్నారు.మమతా మాట్లాడుతూ, తమ ప్రభుత్వం మానవతావాదంతో నడుస్తోందని, బీజేపీ మాత్రం చిచ్చుపెట్టి విభజన కలిగించాలనే కుట్రలో ఉందని ఆరోపించారు. మాల్దా, ముర్షిదాబాద్ అల్లర్ల వెనుక బీజేపీ హస్తమే ఉందని ఆమె ప్రత్యారోపణ చేశారు.
రాష్ట్ర రాజకీయం రంగులోకి వచ్చింది
ఇలా పరస్పర విమర్శలు, సవాళ్లతో బెంగాల్ రాజకీయాలు మరింత వేడెక్కాయి. రెండు పార్టీలూ తమదే గెలుపు అని నమ్మకంగా నిలుస్తున్నాయి. మోదీ ప్రభుత్వ వ్యతిరేకతను మెరుగ్గా ప్రచారం చేస్తుంటే, మమతా తన అధికారాన్ని బలంగా నిలబెట్టేందుకు ప్రణాళికలు వేస్తున్నారు.ఈ ఎన్నికలు సాధారణ ఎన్నికలు కావు. ఈసారి ప్రజలు గట్టిగా తీర్పు చెప్పబోతున్నారు. అవినీతి, అభివృద్ధి, ఉద్యోగాలు, మత రాజకీయాలు—ఇవి అన్నీ ఓటర్లపై ప్రభావం చూపే అంశాలు. ఎవరి వాదన నమ్మకం కలిగిస్తుందో చూడాలి.
Read Also : Donald Trump : ట్రంప్ తన అధికార పరిధిని అతిక్రమించారని కోర్టు స్పష్టీకరణ